ఆంధ్రప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏకంగా 27 వేల కరోనా వైరస్ నమూనాలు పనికిరాకుండా పోయాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. కోవిడ్ నమూనాల సేకరణ తీరుపై అధికారులపై కలెక్టర్ భాస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల నమూనాలు పనికి రాకుండా పోయాయని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. సేకరించిన కోవిడ్ నమూనాలకు ఐడీ నంబర్లు వేయలేదన్నారు. మూతలు లేకుండా నమూనాలు పంపినందుకు తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమూనాలు సేకరించాలని ఆదేశించారు.
మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు కూడా పాఠాలు చెప్పించుకునే స్థాయికి దిగజారారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది తప్పిదాలను ఉపేక్షించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. కాగా, ఏపీలో భారీగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఒకే జిల్లాలో 27 వేల కరోనా నమూనాలు పనికి రాకుండా పోవడం సంచలనంగా మారింది.
కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 27 వేల నమూనాలు పనికి రాకుండా పోయాయని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. సేకరించిన కోవిడ్ నమూనాలకు ఐడీ నంబర్లు వేయలేదన్నారు. మూతలు లేకుండా నమూనాలు పంపినందుకు తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమూనాలు సేకరించాలని ఆదేశించారు.
మండల, నియోజకవర్గ స్థాయి అధికారులు కూడా పాఠాలు చెప్పించుకునే స్థాయికి దిగజారారని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వైద్యాధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది తప్పిదాలను ఉపేక్షించేదిలేదని కలెక్టర్ హెచ్చరించారు. కాగా, ఏపీలో భారీగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాంటి ఒకే జిల్లాలో 27 వేల కరోనా నమూనాలు పనికి రాకుండా పోవడం సంచలనంగా మారింది.