జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. బౌద్ధమతం, గౌతమ బుద్ధుడి మరణం గురించి ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. ‘కొంత మంది మతవాదులు బౌద్ధన్ని విమర్శించే ప్రయత్నంలో బుద్దుడు కుళ్ళిన పంది మాంసం తిని చనిపోయాడు అని చెప్తుంటే కొంచెం హర్ట్ అయ్యాను. ఆయన శాఖాహారి, ఆయన తిన్న శాఖాహారం Pig Delight అనే ఒక పుట్టగొడుగు. పుట్టగొడుగు శాఖాహారం.. పైగా 80నుంచి 90 ఏళ్ల వయసులో ఆ ఆహారం ఆయనకి పడలేదు. ఆయనతో పాటు తిన్న ఆయన శిష్యులకు ఏమి కాలేదు. ఆయన వయసు మీద పడటం.. పుట్టగొడుగు వల్ల వచ్చిన ఎలర్జీతో చనిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి అర్ధంపర్దంలేని విమర్శలు చేయొద్దు’ అన్నారు.
నాగబాబు ట్వీట్పై కొందరు నెటిజన్లు స్పందించారు. ‘ఆయన శిష్యుడు చద ఇచ్చిన పంది మాంసం తిని విరోచనాలు అయ్యు బుద్దుడు మరణించాడు చాలా పుస్తకాల్లో ఇలానే ఉంది,పంది మాంసం తిన్నంత మాత్రాన వారు గొప్ప వాళ్ళు కాకుండా పోతారా, చరిత్ర చూసిన వాళ్ళు లేనప్పుడు రాసినవే నమ్మాలి’అన్నారు. ‘ఇంత జ్ఞానం ఉన్న మీరు పార్లమెంట్ లో ఉండాలి సార్.. ఈసారి ఎలాగైనా నర్సాపురం లో గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టాలి’అని కామెంట్ చేశారు. Read Latest Andhra Pradesh News and Telugu News
అలా చనిపోయాడని చెబుతుంటే.. నేను కొంచెం హర్ట్ అయ్యాను: నాగబాబు
Konidela Nagababu ఆసక్తికర ట్వీట్ చేశారు. బుద్ధుడికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఆయన మరణం విషయంలో జరిగింది ఏంటి.. ఎందుకు చనిపోయారనే అంశాలను ప్రస్తావించారు. మరణం విషయంలో చెబుతున్న విషయాలతో తాను హర్ట్ అయ్యాను అన్నారు. దీనిపై ఓ వివరణ కూడా ఇచ్చారు నాగబాబు. ఆ ట్వీట్పై కొందరు నెటిజన్లు సైతం స్పందిస్తున్నారు. ఇంతకీ బుద్దుడి మరణంపై మెగా బ్రదర్ నాగబాబు వాదన ఏంటి.. నెటిజన్లు ఏమంటున్నారంటే..
ప్రధానాంశాలు:
- మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్
- బుద్దుడి మరణం ప్రస్తావన
- హర్ట్ అయ్యానన్న జనసేన నేత