Patient Died At Anantapur Government Hospital, Wife Alleges On Staff Negligence
అనంతపురంలో అమానుషం: కరోనా భయంతో వైద్యానికి నిరాకరణ.. వ్యక్తి మృతి
అనంతపురంలో కూడా దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే.. కరోనా భయంతో వైద్యానికి నిరాకరించారు. దీంతో బాధితుడు.. ఆస్పత్రి ఎదుట ఉన్న చెట్టుకిందే ప్రాణాలు విడిచాడు.
Samayam Telugu24 Jul 2020, 12:12 pm
మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడు.. అప్పుడప్పుడూ ఈ పదం నిజమవుతోంది. సాటి మనిషి పట్ల కనీసం మానవత్వం చూపించడం లేదు.. దారుణంగా ప్రవర్తిస్తుననారు. కరోనా కష్టం కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరైనా అనారోగ్యంపాలైనా అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కూడా వెనకాడుతున్నారు. అనంతపురంలో కూడా దారుణం జరిగింది. ఓ వ్యక్తి అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే.. కరోనా భయంతో వైద్యానికి నిరాకరించారు. దీంతో బాధితుడు.. ఆస్పత్రి ఎదుట ఉన్న చెట్టుకిందే ప్రాణాలు విడిచాడు.
Samayam Telugu
అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రాజు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నాడు. అతడి భార్య, కుమార్తె అతి కష్టంమీద అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తెల్లవారు జామున మూడు గంటలకు ఓపీ రిజిస్టర్లో పేరు నమోదు చేయించుకున్నారు. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం వార్డులోకి రానివ్వలేదు. దీంతో తెల్లవారు జాము నుంచి ఆసుపత్రి ఆవరణలో రోడ్డుపైనే కూర్చున్నారు.
కొద్దిసేపటికి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయిన రాజు ప్రాణాలు విడిచాడు. కళ్లెదుటే రాజు చనిపోవడంతో భార్య, కుమారుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనపై మీడియాలో హడావిడి కనిపించడంతో ఆస్పత్రి సిబ్బంది వచ్చి స్ట్రెచర్పై మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆస్పత్రికి నిబ్బందిని ఎంత ప్రాధేయపడినా వారు వైద్యం చేయలేదని మృతుడి భార్య కళావతి ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే బతికేవాడని చెబుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి లోకేష్ స్పందించారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?ప్రజలు రోడ్ల మీదే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకునే వారు లేరు అన్నారు. అనంతపురం జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన జగన్ గారి అసమర్థ ప్రభుత్వ పనితీరుకి ఉదాహరణ అన్నారు. అనారోగ్యానికి గురైన ధర్మవరంకి చెందిన రాజు ని కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. 8 గంటల పాటు ప్రాణాలు పోతున్నాయి కాపాడాలని ప్రాధేయపడినా కనికరం చూపించలేదు. వైద్యం అందక రాజు గారు చెట్టు కిందే ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి గారి పబ్లిసిటీ స్టంట్స్ ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి. ఇప్పటికైనా ఆయన మొద్దునిద్ర వీడాలి అన్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.