నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనను హత్య చేస్తానని బెదిరించారని ఆరోపించారు. నాలుగో గేటు నుంచి బుధవారం పార్లమెంటులోకి వస్తుంటే ఎంపీ తనను దూషిస్తూ బెదిరించారన్నారు. గతంలో సెంట్రల్ హాల్లోనూ మాధవ్ బెదిరించారని, దానిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ తనను బెదిరించడంపై ప్రధానికి లేఖ రాశానన్నారు. ‘నేను బుధవారం ఉదయం 10.40 గంటల సమయంలో వైద్య, ఆరోగ్య కమిటీ సమావేశం పూర్తి చేసుకుని తిరిగి పార్లమెంటు ఆవరణలోని గేట్ నంబర్-4 నుంచి ప్రవేశిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మాధవ్ నన్ను చూసి, ‘ఒరేయ్.. నిన్ను మర్డర్ చేసి దెం...’ అని బెదిరించారు. అప్పుడు నేను కూడా ‘ట్రై చేసుకోమని చెప్పా’’ అని రఘురామ అన్నారు.
మాధవ్పై గతంలో కూడా సోషల్ మీడియాలో కొన్ని ఆరోపణలు వచ్చాయన్నారు రఘురామ. సీఎం జగన్ అండ, ప్రోత్సాహంతోనే వైఎస్సార్సీపీ ఎంపీలు తనను దూషిస్తున్నారని.. మర్డర్ చేస్తామని పార్లమెంటు సాక్షిగా పదేపదే భయపెడుతున్నారన్నారు. మరోవైపు పార్లమెంటులో తనను అసభ్య పదజాలంతో దూషించిన నందిగం సురేష్ ఆ తర్వాత అలా మాట్లాడలేదని అంటున్నారని.. వాస్తవాలు ఒప్పుకోలేని ధైర్యం లేని వాళ్లు ఆ విధంగా మాట్లాడటం ఎందుకన్నారు. నందిగం సురేష్ తనను పార్లమెంట్లో దూషించారని ఎంపీ రఘురామ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
ఆ ఎంపీ నన్ను మర్డర్ చేస్తానన్నారు.. పెద్ద బాంబ్ పేల్చిన రఘురామ
నాలుగో గేటు నుంచి బుధవారం పార్లమెంటులోకి వస్తుంటే ఎంపీ తనను దూషిస్తూ బెదిరించారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు తనను దూషిస్తున్నారని.. మర్డర్ చేస్తామని పార్లమెంటు సాక్షిగా పదేపదే భయపెడుతున్నారన్నారు.
Samayam Telugu 9 Dec 2021, 7:27 am
ప్రధానాంశాలు:
- వైఎస్సార్సీపీ ఎంపీ మాధవ్ చంపేస్తానని బెదిరించారు
- ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశానన్న ఎంపీ రఘురామ
- పార్లమెంట్ సాక్షిగా పదే, పదే భయపెడుతున్నారు