తెలుగు రాష్ట్రాల్లో రాఖీ సందడి కనిపిస్తోంది. అన్న చెల్లెలు, అక్కా తమ్ముళ్లు ఆనందంగా జరుపుకునే పండుగ. కానీ ఓ కుటుంబంలో సోదరులు మాత్రం.. తమ సోదరి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆమె జ్ఞాపకాలు తమతో ఉండేలా.. ఆమెపై ప్రేమతో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాఖీ సందర్భంగా విగ్రహాన్ని ఊరిలో ఊరేగించి తమ ప్రేమను ఇలా చాటుకున్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన మణికి వివాహమైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కానీ 7 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బైక్పై ప్రయాణిస్తుండగా వెనుక చక్రంలో చున్నీ ఇరుక్కోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆమె మృతిని జీర్ణించుకోలేని అక్క వరలక్ష్మి, అన్నయ్య శివ, తమ్ముడు రాజాలు.. తన సోదరిలా ఎవరికీ జరగకూడదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు.
తమ సోదరి జ్ఞాపకాలను నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆమె విగ్రహాన్ని తయారు చేయించారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రక్షాబంధన్ను గ్రామంలో పండగలా నిర్వహించారు. రాఖీ సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఊరేగించారు. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రతిష్ఠించుకున్నారు. తాము ప్రతి ఏటా రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే వాళ్లమని.. కానీ మణి లేని లోటు తీర్చలేనిది అంటున్నారు. అందుకే ఆమెను తలుచుకుంటూ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాఃమన్నారు. బైక్పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.
తమ సోదరి జ్ఞాపకాలను నిత్యం కళ్లముందే చూసుకోవాలని ఆమె విగ్రహాన్ని తయారు చేయించారు. ఆమె విగ్రహాన్ని చేయించి ఈ ఏడాది రక్షాబంధన్ను గ్రామంలో పండగలా నిర్వహించారు. రాఖీ సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఊరేగించారు. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రతిష్ఠించుకున్నారు. తాము ప్రతి ఏటా రాఖీ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునే వాళ్లమని.. కానీ మణి లేని లోటు తీర్చలేనిది అంటున్నారు. అందుకే ఆమెను తలుచుకుంటూ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాఃమన్నారు. బైక్పై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.