యాప్నగరం

శ్రీకాకుళం ఆడపడుచుకి యువ ఎంపీ విషెస్.. మరెంతో కీర్తి తేవాలని.!

ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ బాధ్యతలను ఢిల్లీ ప్రభుత్వం అప్పగించింది.

Samayam Telugu 23 Jun 2021, 6:59 pm
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి వైస్ చాన్సలర్‌గా నియమితులైన ఒలింపిక్ పతక విజేత, సిక్కోలు ఆడపడుచు కరణం మల్లీశ్వరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె ఢిల్లీ వర్సిటీ వీసీగా నియమితులు కావడంపై సిక్కోలు యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలియజేశారు. తమ ఆడపడుచుకి అరుదైన గౌవరం దక్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ఎంతో కీర్తిప్రతిష్టలు తెచ్చిన మల్లీశ్వరి మరెంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్ది దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిచారు. ఆమెకు అభినందనలు తెలియజేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
malleswari


జరిగిన సిడ్నీ ఒలంపిక్స్‌ 2000లో వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తాచాటి కరణం మల్లీశ్వరి పతకం సాధించారు. హర్యానాలో ఎఫ్‌సీఐలో కీలక పోస్టులో పనిచేస్తున్న ఆమెను ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా నియమించింది. పశ్చిమ ఢిల్లీ జిల్లా ముండ్కా పట్టణంలో దేశంలోనే తొలి స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఢిల్లీ ప్రభుత్వం నిర్మిస్తోంది. రానున్న ఒలింపిక్స్‌, కామన్వెల్త్‌ క్రీడల్లో కనీసం 50 పతకాలు సాధించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.