ఎన్నడూ లేనివిధంగా టమాటా ధరలు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు ఉల్లి కూడా కన్నీరు తెప్పించే దిశగా పరుగులు పెడుతోంది. నిన్న మొన్నటి వరకు బహిరంగ మార్కెట్లో కిలో రూ.12 నుంచి రూ.15 పలికిన ఉల్లి ప్రస్తుతం రెండింతలు పెరిగింది. శనివారం ఒక్కరోజే రూ.40 వరకు చేరుకుంది. హోల్సేల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.30 పలుకుతోంది. ముందు ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల ఉల్లిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి నిల్వలు లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
మరోవైపు దేశంలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన మహారాష్ట్రలోని లాసల్గాన్లో 100 కిలోల ఉల్లిగడ్డల ధర రూ.1,600కు చేరింది. అలాగే గతంలో రోజుకు 25 వేల క్వింటాళ్ల ఉల్లి రాగా, ప్రస్తుతం అది 10 వేల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి సాగు లేదని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సరుకంతా మార్చి, ఏప్రిల్లో ఉత్పత్తి అయిందని, స్టోరేజీల నుంచి వాటిని బయటకు తీస్తున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే చాలా మంది రైతులు ఇప్పటికే తమ పంటను అమ్మేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే ఉత్పత్తి అయిన ఉల్లి మొత్తం వ్యాపారుల దగ్గరకు చేరిపోయినట్టే. దీంతో ధరలపై వారిదే ఆధిపత్యం. ఈ క్రమంలో త్వరలోనే ఉల్లి కూడా కన్నీళ్లు తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా 17 ప్రధాన పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాల్లో టమాటా ధర గరిష్ట స్థాయిలోనే కిలో రూ.100 వరకు పలికింది. వీటిలో రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు, కోల్కతా, ముంబయి, హైదరబాద్, ఇండోర్, తిరువనంతపురం కూడా ఉన్నాయి. మూడు మాసాల కిందట ఢిల్లీలో మూడు నెలల రూ.26 ఉన్న కిలో టమాటా ఇప్పుడు రూ.92కు చేరుకుంది. ఏప్రిల్ - జులై మధ్య కాలంలో టమాటా ధరలు చైన్నలో ఐదు రెట్లు, బెంగళూరులోనూ ఆరు రెట్లు పెరిగింది. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో ఇప్పటికప్పుడు పరిస్థితులు మెరుగపడే అవకాశాల్లేవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్ట్ చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు దేశంలోనే అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచిన మహారాష్ట్రలోని లాసల్గాన్లో 100 కిలోల ఉల్లిగడ్డల ధర రూ.1,600కు చేరింది. అలాగే గతంలో రోజుకు 25 వేల క్వింటాళ్ల ఉల్లి రాగా, ప్రస్తుతం అది 10 వేల క్వింటాళ్లకు పడిపోయింది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఉల్లి సాగు లేదని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సరుకంతా మార్చి, ఏప్రిల్లో ఉత్పత్తి అయిందని, స్టోరేజీల నుంచి వాటిని బయటకు తీస్తున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే చాలా మంది రైతులు ఇప్పటికే తమ పంటను అమ్మేసుకున్నట్టు చెబుతున్నారు. అంటే ఉత్పత్తి అయిన ఉల్లి మొత్తం వ్యాపారుల దగ్గరకు చేరిపోయినట్టే. దీంతో ధరలపై వారిదే ఆధిపత్యం. ఈ క్రమంలో త్వరలోనే ఉల్లి కూడా కన్నీళ్లు తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా 17 ప్రధాన పట్టణాలతోపాటు ఇతర ప్రాంతాల్లో టమాటా ధర గరిష్ట స్థాయిలోనే కిలో రూ.100 వరకు పలికింది. వీటిలో రాజధాని ఢిల్లీతోపాటు బెంగళూరు, కోల్కతా, ముంబయి, హైదరబాద్, ఇండోర్, తిరువనంతపురం కూడా ఉన్నాయి. మూడు మాసాల కిందట ఢిల్లీలో మూడు నెలల రూ.26 ఉన్న కిలో టమాటా ఇప్పుడు రూ.92కు చేరుకుంది. ఏప్రిల్ - జులై మధ్య కాలంలో టమాటా ధరలు చైన్నలో ఐదు రెట్లు, బెంగళూరులోనూ ఆరు రెట్లు పెరిగింది. వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో ఇప్పటికప్పుడు పరిస్థితులు మెరుగపడే అవకాశాల్లేవని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆగస్ట్ చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.