PM Modi గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి విరుచుకుపడ్డారు. అహ్మదాబాద్ సమీపంలోని బెహ్రంపుర ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీపై ఖర్గే తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా మోదీ తన ముఖం చూసి ఓట్లు వేయమని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని తన పనిని వదిలేసి కార్పొరేషన్, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఏవైనా మోదీ ముఖమే కనిపిస్తోందని, తనను చూసి ఓటేయమంటున్నారు.. మోదీజీ మీకు రావణుడిలా వంద తలలున్నాయా? అని ప్రశ్నించారు. మున్సిపల్, కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికలు అసలు ఎన్నికలేవైనా మోదీ పేరుతో ఓట్లు అడుగుతున్నారని, అభ్యర్ధి పేరుతో ఓట్లు అడగండని ఖర్గే హితవు పలికారు. మోదీ వచ్చి మున్సిపాలిటీలో పనులు చేసి పెడతారా? మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, అవసరం వచ్చినా మోదీ సాయం చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘మోదీజీ ప్రధానమంత్రి.. తన పని మరిచిపోయి కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఇలా ప్రతి చోటా ప్రచారం చేసుకుంటూనే ఉంటారు.... ఇంకెవరినీ చూడనవసరం లేదు.. మోదీని చూసి ఓటేయండి’అన్ని వేళలా తన గురించే చెప్పుకుంటున్నారు.. ‘మేము మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూస్తాం? మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? నీకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా’’ అని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించి సభలో నవ్వులు పూయించారు.
ఇక, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో.. ప్రధానిపై ఖర్గే పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు. ప్రధాని ఓటర్ల సానుభూతి పొందడానికి తాను పేదవాడినని పదేపదే చెబుతున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారని ఇటీవల ఓ ర్యాలీలో ఖర్గే విమర్శించారు.
అయితే, ప్రధాని మోదీని ఖర్గే రావణుడితో పోల్చడం పట్ల కాషాయనేతలు మండిపడుతున్నారు. గుజరాత్ పుత్రుడ్ని కాంగ్రెస్ అధ్యక్షుడు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో ప్రజా సమస్యల మీద పోరాడటం చేతకాని కాంగ్రెస్ సహనం కోల్పోయి ప్రధానిపై చవకబారు విమర్శలు చేస్తోందని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 8న వెల్లడి కానున్నాయి. గుజరాత్ తొలి దశ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో తుది అంకంలో రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.
Read Latest National News And Telugu News
ఇక, మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో.. ప్రధానిపై ఖర్గే పదునైన వ్యాఖ్యలు చేస్తూ ఓటర్లను ఆలోచనలో పడేస్తున్నారు. ప్రధాని ఓటర్ల సానుభూతి పొందడానికి తాను పేదవాడినని పదేపదే చెబుతున్నారని, ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూ ఓట్ల వేట సాగిస్తున్నారని ఇటీవల ఓ ర్యాలీలో ఖర్గే విమర్శించారు.
అయితే, ప్రధాని మోదీని ఖర్గే రావణుడితో పోల్చడం పట్ల కాషాయనేతలు మండిపడుతున్నారు. గుజరాత్ పుత్రుడ్ని కాంగ్రెస్ అధ్యక్షుడు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్లో ప్రజా సమస్యల మీద పోరాడటం చేతకాని కాంగ్రెస్ సహనం కోల్పోయి ప్రధానిపై చవకబారు విమర్శలు చేస్తోందని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుండగా.. ఫలితాలు డిసెంబరు 8న వెల్లడి కానున్నాయి. గుజరాత్ తొలి దశ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో తుది అంకంలో రాజకీయ పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి.
Read Latest National News And Telugu News