దేశంలో మహిళలకు ఎక్కడా భద్రత లేకుండా పోతోంది. చదువుకునే చోట, ఉద్యోగాలు చేసే చోట ఇలా ఎక్కడికెళ్లినా కామాంధుల వికృత చేష్టలు వారి జీవితాలను నాశనం చేస్తూనే ఉన్నాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు సైతం ఇలాంటి పెడధోరణులు పట్టడం ఆందోళన కలిగిస్తోంది.
అపస్మారక స్థితి నుంచి తేరుకున్నాక జరిగిన అఘాయిత్యంపై నిలదీయగా రాకేష్ తనను బెదిరించాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలు సోషల్మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. పిలిచినప్పుడల్లా తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని, కుటుంబ పరువు పోతోందన్న ఆందోళనతోనే రెండేళ్లుగా ఓపిక పడుతున్నానని, ఇక భరించలేకే ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడు రాకేశ్ సింగ్ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.