అర్ధరాత్రి సమయంలో రైలు లక్నో నగరాన్ని సమీపిస్తోంది. ఓ కోచ్లో మహిళ ఒక్కసారిగా పెద్దగా కేకలు వేశారు. ఆమె కేకలు విని బోగీలోని ప్రయాణికులంతా అక్కడికి పరుగెత్తుకొచ్చి చూడగా.. ఆమె టీటీఈ చొక్కా పట్టుకొని ఉన్నారు. అతడు తనపై మూత్ర విసర్జన వారికి చెబుతూ కోపంతో ఊగిపోయారు. ఫూటుగా తాగి ఉన్న ఆ టీటీఈని ప్రయాణికులు పట్టుకొని, రైలు లక్నో స్టేషన్ చేరుకోగానే.. రైల్వే పోలీసులకు అప్పగించారు. అమృత్సర్ - కోల్కతా ‘అకాల్ తక్త్ ఎక్స్ప్రెస్’ రైలులో ఆదివారం (మార్చి 12) అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనల గురించి మరచిపోకముందే రైల్లో అలాంటిదే మరో దారుణం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈసారి ఏకంగా ఆ పని చేసింది అధికారే కావడం మరింత దారుణమైన అంశం. మద్యం మత్తులో అతడు ఆ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అమృత్సర్ (పంజాబ్)కు చెందిన బాధిత మహిళ తన భర్త రాజేష్ కుమార్తో కలిసి ఆ రైలులో ప్రయాణిస్తున్నారు. నిందితుడిని బీహార్కు చెందిన మున్నా కుమార్గా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు టీటీఈపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
న్యూయార్క్ - న్యూఢిల్లీ విమానంలో..
మార్చి 4న న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీ వచ్చిన విమానంలో ఓ యువకుడు.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అమెరికన్ ఎయిర్లైన్స్ అతడిపై విమానయానం చేయకుండా నిషేధం విధించింది. నిందితుడిని ఆర్య వోహ్రా (21 ఏళ్లు) గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికాలో ఉంటున్నాడు.
ఆర్టీసీ బస్సులో తోటి ప్రయాణికురాలిపై..
కర్ణాటక ఆర్టీసీ బస్సులోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. విజయపుర నుంచి మంగళూరు వెళ్తున్న నాన్-ఏసీ స్లీపర్ బస్సులో హుబ్బల్లికి సమీపంలో 32 ఏళ్ల వ్యక్తి.. మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Must Read: భానూకు 1983లోనే ఆస్కార్.. RRR ఆస్కార్ పొందిన తొలి భారతీయ సినిమా ఎలా అయ్యింది?
న్యూయార్క్ - న్యూఢిల్లీ విమానంలో..
మార్చి 4న న్యూయార్క్ నుంచి న్యూ ఢిల్లీ వచ్చిన విమానంలో ఓ యువకుడు.. ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అమెరికన్ ఎయిర్లైన్స్ అతడిపై విమానయానం చేయకుండా నిషేధం విధించింది. నిందితుడిని ఆర్య వోహ్రా (21 ఏళ్లు) గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అతడు అమెరికాలో ఉంటున్నాడు.
ఆర్టీసీ బస్సులో తోటి ప్రయాణికురాలిపై..
కర్ణాటక ఆర్టీసీ బస్సులోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. విజయపుర నుంచి మంగళూరు వెళ్తున్న నాన్-ఏసీ స్లీపర్ బస్సులో హుబ్బల్లికి సమీపంలో 32 ఏళ్ల వ్యక్తి.. మహిళా ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Must Read: భానూకు 1983లోనే ఆస్కార్.. RRR ఆస్కార్ పొందిన తొలి భారతీయ సినిమా ఎలా అయ్యింది?