ప్రేమించిన యువతి తనను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ దుండిగల్ పరిధిలో చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలోని కొండపల్లికి చెందిన మురళి కుటుంబంతో కలిసి బహుదూర్పల్లిలో నివాసముంటున్నాడు. అమెజాన్ సంస్థలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆఫీసుకు వెళ్లకపోవడంతో సంస్థ ప్రతినిధులు మురళికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతడి ఇంటికి సమీపంలోనే ఉంటున్న మరో ఉద్యోగికి ఫోన్ చేసి చెప్పగా అతడు మురళి ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో విజయవాడకు వెళ్లిన మురళీ తండ్రికి అతడు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మురళి మొబైల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు ముందు ఒక యువతితో చాట్ చేసినట్లు గుర్తించారు. ‘నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అయినా నన్ను దూరం పెడుతున్నావు’ అంటూ మురళి ఓ యువతికి మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు మురళి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా నిర్ధారించారు. ఆ యువతిని విచారించి మరిన్ని వివరాలే సేకరిస్తామన్నారు.
మురళి మొబైల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు ఆత్మహత్యకు ముందు ఒక యువతితో చాట్ చేసినట్లు గుర్తించారు. ‘నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అయినా నన్ను దూరం పెడుతున్నావు’ అంటూ మురళి ఓ యువతికి మెసేజ్ చేశాడు. దీంతో పోలీసులు మురళి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా నిర్ధారించారు. ఆ యువతిని విచారించి మరిన్ని వివరాలే సేకరిస్తామన్నారు.