ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలోని ఆమె నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశమైంది.
ఏడు నెలల క్రితమే రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే అంశంపై చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండటం వల్ల ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆమోదం కానీ వ్యక్తిని అధికార ఎన్డీయే అభ్యర్థిగా నిలబెడితే... ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై సోనియాగాంధీ పార్టీ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటిని (బీజేపీయేతర పార్టీలు) ఒకేతాటిపైకి తీసుకురావాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు.
మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కిన ఫలితాలు,ఓటమిపై చర్చిస్తున్నారు.
ఈ యేడాది చివరిలోగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. అక్టోబర్ 10లోగా కొత్త అధ్యక్షుణ్ని (అధ్యక్షురాలు) ఎన్నుకోవాలి. పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీలో 25 సభ్యులున్నారు. పార్టీ ప్రెసిడెంట్ ను సీడబ్ల్యూసీ ఎన్నుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇతర పార్టీ విభాగాలు, కమిటీలతో ఆమోదింపజేసుకునే అవకాశాలపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఏడు నెలల క్రితమే రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే అంశంపై చర్చ జరిగింది. అయితే ఆ సమయంలో సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండటం వల్ల ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆమోదం కానీ వ్యక్తిని అధికార ఎన్డీయే అభ్యర్థిగా నిలబెడితే... ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే అంశంపై సోనియాగాంధీ పార్టీ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటిని (బీజేపీయేతర పార్టీలు) ఒకేతాటిపైకి తీసుకురావాలన్న అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు.
మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు దక్కిన ఫలితాలు,ఓటమిపై చర్చిస్తున్నారు.
ఈ యేడాది చివరిలోగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. అక్టోబర్ 10లోగా కొత్త అధ్యక్షుణ్ని (అధ్యక్షురాలు) ఎన్నుకోవాలి. పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీలో 25 సభ్యులున్నారు. పార్టీ ప్రెసిడెంట్ ను సీడబ్ల్యూసీ ఎన్నుకునే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇతర పార్టీ విభాగాలు, కమిటీలతో ఆమోదింపజేసుకునే అవకాశాలపై అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.