తమిళనాడు అసెంబ్లీలో ఇటీవల పళనిసామి ప్రభుత్వం జరిపిన అవిశ్వాస తీర్మానం చెల్లదని పేర్కొంటూ, ఆ తీర్మానాన్ని రద్దు చేయాల్సిందిగా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ దాఖలు చేసిన పిటీషన్ని మద్రాస్ హై కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ తీర్మానంపై బుధవారంనాడు విచారణ చేపట్టనున్నట్టు తాజాగా కోర్టు స్పష్టంచేసింది.
Madras High Court to hear DMK's petition challenging trust vote in Tamil Nadu Assembly tomorrow pic.twitter.com/nUwMiFd9Kg— TIMES NOW (@TimesNow) February 21, 2017
చట్టం ప్రకారం ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాకా, ఆ తీర్మానం ప్రక్రియ పూర్తికాకుండా అసెంబ్లీని వాయిదా వేయవద్దని చెబుతున్నారు స్టాలిన్. కానీ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పూర్తికాకుండానే రెండుసార్లు వాయిదా అనంతరం రెండుసార్లు సభలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందంటున్న స్టాలిన్.. అది చట్ట విరుద్దం అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డీఎంకే లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.
Madras High Court to hear DMK's petition challenging trust vote in Tamil Nadu Assembly tomorrow pic.twitter.com/nUwMiFd9Kg— TIMES NOW (@TimesNow) February 21, 2017
చట్టం ప్రకారం ఒకసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాకా, ఆ తీర్మానం ప్రక్రియ పూర్తికాకుండా అసెంబ్లీని వాయిదా వేయవద్దని చెబుతున్నారు స్టాలిన్. కానీ ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం పూర్తికాకుండానే రెండుసార్లు వాయిదా అనంతరం రెండుసార్లు సభలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందంటున్న స్టాలిన్.. అది చట్ట విరుద్దం అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. డీఎంకే లేవనెత్తుతున్న అభ్యంతరాలపై కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.