ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ సమావేశాలతో బిజీగా గడిపిన రాహుల్.. రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చారు. జాలీగా గోవా టూర్కు వెళ్లారు. రాహుల్తో పాటూ సోనియా గాంధీ కూడా ట్రిప్లో ఉన్నారట. గోవాలో సెల్ఫీలు, సీ ఫుడ్ తింటూ ట్రిప్ను రాహుల్ ఎంజాయ్ చేశారు. పర్యాటకులతో కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. రచనా ఫెర్నాండేజ్ అనే టూరిస్ట్ రాహుల్తో ఫోటో దిగారు. చెత్త రాజకీయాల్లో చాలా మంచి వ్యక్తి రాహుల్ గాంధీ అంటూ ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. రాహుల్ ఆదివారం దక్షిణ గోవాలో సీఫుడ్కు ప్రసిద్ధి చెందిన ‘వార్ఫ్ రెస్టారెంట్’కు వెళ్లిన సమయంలో ఈ ఫోటో క్లిక్ అనిందట. రచనా మాత్రమే కాదు.. మరికొందరు టూరిస్టులతో కూడా రాహుల్ సెల్ఫీలు దిగారట.
రాహుల్ గాంధీ గోవా టూర్కు వెంట సెక్యూరిటీని తీసుకెళ్లలేదట. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని తెలుస్తోంది. అందుకే భద్రతా సిబ్బంది లేకుండానే గోవాకు వెళ్లారట. సెక్యూరిటీ గోల లేకపోవడంతోనే రాహుల్ చాలా ఫ్రీగా ఉన్నారని.. అందరితో సరదాగా గడుపుతూ సెల్ఫీలు దిగుతున్నారని రచనా చెబుతున్నారు.
రాహుల్ గాంధీ గోవా టూర్కు వెంట సెక్యూరిటీని తీసుకెళ్లలేదట. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమని తెలుస్తోంది. అందుకే భద్రతా సిబ్బంది లేకుండానే గోవాకు వెళ్లారట. సెక్యూరిటీ గోల లేకపోవడంతోనే రాహుల్ చాలా ఫ్రీగా ఉన్నారని.. అందరితో సరదాగా గడుపుతూ సెల్ఫీలు దిగుతున్నారని రచనా చెబుతున్నారు.