2001 సంవత్సరం సెప్టెంబరు 11న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన లాడెన్ టీమ్ జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఆల్ఖైదా పక్కా వ్యూహంతో జరిపిన దాడులవి. ఆ రోజు ఉదయం 10 మంది ఆల్ఖైదా తీవ్రవాదులు.. వాణిజ్య సేవలందించే నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించారు.
హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్ఖైదా నాయకుడు ఓసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది.
మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ D.Cకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. దీనిని హైజాకర్లు వాషింగ్టన్ D.C వైపుకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు. న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు. రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
తెర వెనుక ఇంత జరిగిందా..
సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు మరియు బిన్ లాడెన్ యొక్క 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది.[102] డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా USAలో దాడులకు అల్ఖైదా సన్నద్ధమవుతోందని అధ్యక్షుడు బిల్ క్లింటన్కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం తెలిపింది.
అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్పైన దాడులు జరపగలిగింది.
హైజాకర్లు రెండు విమానాలను న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్(ప్రపంచ వాణిజ్య సంస్థ)కు చెందిన జంట సౌధాలను ఢీకొట్టించారు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. ఈ బృందానికి అప్పటి ఆల్ఖైదా నాయకుడు ఓసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన దాడి ఘటనలో ప్రయాణికులందరూ, భవనాల్లో పనిచేస్తున్న అనేక మంది ఇతరులు దుర్మరణం పాలయ్యారు. రెండు సౌధాలు(భవనాలు) అందరూ చూస్తుండగానే గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. సమీపంలోని భవనాలు ధ్వంసం అవడం, మరికొన్ని పాక్షికంగా దెబ్బతినడం జరిగింది.
మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్ D.Cకి వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణీకులు మరియు విమాన సిబ్బంది తిరిగి దానిని నియంత్రించే ప్రయత్నం చేసినప్పుడు, గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదానంలో అది కుప్పకూలింది. దీనిని హైజాకర్లు వాషింగ్టన్ D.C వైపుకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు నివేదించాయి.
సెప్టెంబరు 11 దాడుల్లో 3000 మంది బాధితులు, 19 మంది హైజాకర్లు మరణించారు. న్యూయార్క్ ప్రభుత్వారోగ్య శాఖ నివేదిక ప్రకారం, జూన్ 2019 నాటికి అగ్నిమాపక దళ సిబ్బంది మరియు పోలీసులు సహా రక్షణ చర్యల్లో పాల్గొన్న 836 మంది మరణించారు. రెండు భవనాల్లో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది దుర్మరణం చెందారు. మరణించిన వారిలో అత్యధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందిన వారున్నారు.
తెర వెనుక ఇంత జరిగిందా..
సెప్టెంబర్ 11 దాడుల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారి ఖలీద్ షేక్ మహ్మద్. 1996లో అతను తన వ్యూహాన్ని ఒసామా బిన్ లాడెన్కు వివరించాడు. ఆ సమయంలో, బిన్ లాడెన్ మరియు అల్ఖైదాలు మార్పు దశలో ఉన్నాయి. సూడాన్ నుంచి తిరిగి ఆఫ్గనిస్తాన్కు మకాం మార్చుకున్నారు. 1998 ఆఫ్రికన్ దౌత్యకార్యాలయంపై బాంబు దాడులు మరియు బిన్ లాడెన్ యొక్క 1998 ఫత్వా ఒక మలుపును గుర్తించాయి. అంటే బిన్ లాడెన్ అమెరికా సంయుక్తరాష్ట్రాలపై దాడులకు కుట్ర పన్నే యోచనలో ఉన్నట్లు అర్థమైంది.[102] డిసెంబరు, 1998లో విమానాల దారిమళ్లింపుకు వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం సహా USAలో దాడులకు అల్ఖైదా సన్నద్ధమవుతోందని అధ్యక్షుడు బిల్ క్లింటన్కు డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తీవ్రవాద నిరోధన కేంద్రం తెలిపింది.
అమెరికా రక్షణ శాఖ ఎంతో శక్తివంతమైనది, సీఐఏ ఎంతో ముందుచూపు కలిగి ఉన్నదైనప్పటికీ ఆల్ఖైదా టీమ్ పక్కా ప్రణాళికతో అనుకున్న విధంగా వరల్డ్ ట్రేడ్ సెంటర్పైన దాడులు జరపగలిగింది.