జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పవన్ 2016లో చెప్పి, ఇప్పుడు రాజీనామాలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ఆదివారం నాడు విమర్శించిన రోజా, నేడు కూడా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు ధర్నాలు, నిరసనలకు దిగుతానని హెచ్చరించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు ఎందుకు వెనక్కు తగ్గారని ఆమె ప్రశ్నించారు.
సోమవారం ఉదయం తిరుమలకు విచ్చేసిన నగరి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ పేరుతో హడావుడి చేసి ప్రజల ముందుకు వస్తే ఎవరు నమ్మబోరని ఎద్దేవా చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి, పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం ఆయన సహకరించాలని రోజా డిమాండ్ చేశారు.
అంతేకాదు టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని రోజా విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం అన్ని పార్టీలు పొగబెట్టిన తర్వాత బయటకొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఆయన కానీ, ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె నిలదీశారు. ప్యాకేజీతో ఉపయోగం లేదని నాడే జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.
సోమవారం ఉదయం తిరుమలకు విచ్చేసిన నగరి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ... ప్రశ్నిస్తానంటూ గొప్పలు చెప్పుకున్న పవన్, నాలుగేళ్ల పాటు మౌనంగా ఉండి, ఇప్పుడు జేఎఫ్సీ పేరుతో హడావుడి చేసి ప్రజల ముందుకు వస్తే ఎవరు నమ్మబోరని ఎద్దేవా చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి, పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ సూచించిన విధంగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అందుకు అవసరమైన ఎంపీల మద్దతు కోసం ఆయన సహకరించాలని రోజా డిమాండ్ చేశారు.
అంతేకాదు టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని రోజా విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం అన్ని పార్టీలు పొగబెట్టిన తర్వాత బయటకొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఆయన కానీ, ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతున్నారని ఆమె నిలదీశారు. ప్యాకేజీతో ఉపయోగం లేదని నాడే జగన్మోహన్రెడ్డి చెప్పారని గుర్తుచేశారు.