అనుమానమనే జబ్బు వట వృక్షంగా రూపాంతరం చెందితే ఎలా ఉంటుందో ఈ వ్యక్తే నిదర్శనం. ఓ వ్యక్తి భార్యపై పెంచుకున్న అనుమానం తారస్థాయికి చేరడంతో ఆమెను దారుణంగా కొట్టి అడవిలో వదిలేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో చోటు చేసుకుంది. కుర్రెఘడ్ పునరావాస కాలనీలో నివసించే సోనెరావు అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. మూడు రోజులుగా సోనెరావు భార్య గంగుబాయి కనిపించకపోవడంతో ఆమె బంధువులు మొన్న రాత్రి దేవాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంగుబాయి అడవుల్లో ఉందని తెలుసుకున్నారు.
పాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ కనిపించిందని తిరుమలాపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆమెను తీసుకురావడానికి పోలీసులు వెళ్లారు. అయితే, అప్పటికే ఆమె అడవిల్లో నుంచి బయటపడి సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు సోనెరావు అనుమానంతో ఆమెను చావబాది, అడవుల్లో విడిచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చికిత్స కోసం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సదరు భర్తను ఇంకా అదుపులోకి తీసుకోలేదు.
పాత తిరుమలాపూర్ అటవీ ప్రాంతంలో ఓ మహిళ కనిపించిందని తిరుమలాపూర్ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆమెను తీసుకురావడానికి పోలీసులు వెళ్లారు. అయితే, అప్పటికే ఆమె అడవిల్లో నుంచి బయటపడి సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడు సోనెరావు అనుమానంతో ఆమెను చావబాది, అడవుల్లో విడిచిపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. చికిత్స కోసం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే సదరు భర్తను ఇంకా అదుపులోకి తీసుకోలేదు.