యూరీ ఘటన తరువాత పాకిస్థాన్ అకృత్యాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పే విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సవరించుకోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన కొందరు యువతీ యువకులు వినూత్న రీతిలో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. తక్షణమే పాకిస్థాన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు తమ రక్తంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖలు రాశారు. మొన్నటికి మొన్న పఠాన్ కోట్ సైనిక స్థావరంపై పాకిస్థాన్ తీవ్రవాదుల దాడిని మరిచిపోకముందే, మళ్లీ యూరీ ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. యూరీపై పాక్ తీవ్రవాదుల దాడిలో 18మంది జవాన్లు వీరమరణం పొందారు. వారి కుటుంబాలతో పాటు యావద్దేశం చనిపోయిన వీరజవాన్ల కోసం కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇకనైనా రక్తక్రీడను ముగించాలని డిమాండ్ చేస్తూ తాము రక్తంతో లేఖలు రాస్తున్నామని ప్రధానికి తెలిపారు.
పాక్పై ప్రతీకారంకోసం రక్తంతో లేఖలు
పాకిస్థాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కొంతమంది యువతీ యువకులు మోడీకి తమ రక్తంతో లేఖలు రాశారు.
TNN 23 Sep 2016, 5:28 pm