వన్డే క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్కు 21 ఏళ్ల అరంగేట్ర బౌలర్ షాకిచ్చాడు. గౌహతిలో భారత్తో జరుగుతున్న తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విండీస్ బౌలర్ ఓషేన్ థామస్ శిఖర్ ధావన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 10 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. గంటకు 147 నుంచి 149 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్న థామస్.. తను వేసిన తొలి ఓవర్లోనే ధావన్ను పెవిలియన్కు పంపాడు. థామస్ బౌలింగ్లో ఫోర్ కొట్టి ఖాతా తెరిచిన ధావన్.. ఓవర్ ఆఖరి బంతికి ఔటయ్యాడు. ధావన్ బౌల్డ్ అయిన బంతి కూడా గంటకు 147 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది.
ధావన్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ధావన్ వికెట్ తీసిన థామస్ బౌలింగ్లో వీరిద్దరూ వీరబాదుడు బాదారు. థామస్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 18 పరుగులు రాబట్టారు. కోహ్లీ రెండు ఫోర్లు కొట్టగా.. రోహిత్ శర్మ భారీ సిక్స్ బాదాడు. థామస్ వేసిన ఎనిమిదో ఓవర్లోనూ 9 పరుగులు చేశారు. తొలి స్పెల్లో 4 ఓవర్లు వేసిన థామస్.. ఒక వికెట్ తీసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న కోహ్లీ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 82 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (23 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (53 బ్యాటింగ్) ఆడుతున్నారు.
ధావన్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. ధావన్ వికెట్ తీసిన థామస్ బౌలింగ్లో వీరిద్దరూ వీరబాదుడు బాదారు. థామస్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 18 పరుగులు రాబట్టారు. కోహ్లీ రెండు ఫోర్లు కొట్టగా.. రోహిత్ శర్మ భారీ సిక్స్ బాదాడు. థామస్ వేసిన ఎనిమిదో ఓవర్లోనూ 9 పరుగులు చేశారు. తొలి స్పెల్లో 4 ఓవర్లు వేసిన థామస్.. ఒక వికెట్ తీసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న కోహ్లీ 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి భారత్ 82 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (23 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (53 బ్యాటింగ్) ఆడుతున్నారు.