ఇంగ్లాండ్తో శుక్రవారం ప్రారంభమైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. కరోనా కారణంగా ఈ మ్యాచ్కి కెప్టెన్/ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) దూరమవగా.. అతని స్థానంలో ఓపెనర్గా మయాంక్ అగర్వాల్ని టీమిండియా ఆడిస్తుందని అంతా ఊహించారు. కానీ.. కొత్త కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టాస్ టైమ్లోనే చతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఓపెనర్గా ఆడబోతున్నట్లు ప్రకటించేశాడు. దాంతో.. ప్రొఫెషనల్ ఓపెనర్ మయాంక్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో శుభమన్ గిల్తో కలిసి చతేశ్వర్ పుజారా భారత్ ఇన్నింగ్స్ని ప్రారంభించాడు. వాస్తవానికి 33 ఏళ్ల చతేశ్వర్ పుజారాపై గత ఏడాది ఆరంభంలో భారత సెలెక్టర్లు వేటు వేశారు. పేలవ ఫామ్ని కారణంగా చూపుతూ శ్రీలంకతో టెస్టు సిరీస్కి అతడ్ని ఎంపిక చేయలేదు. దాంతో.. ఇంగ్లాండ్లో కౌంటీలు ఆడిన పుజారా ఫామ్ అందుకోవడంతో పాటు పరుగుల వరద పారించేశాడు. దెబ్బకి భారత సెలెక్టర్ల నుంచి ఇంగ్లాండ్తో టెస్టు కోసం మళ్లీ పిలుపు వచ్చింది.
ఓపెనర్గా చతేశ్వర్ పుజారాకి మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ ఆరు ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా ఆడిన పుజారా 131.66 సగటుతో ఏకంగా 395 పరుగులు చేశాడు. ఓపెనర్గా అతని అత్యధిక స్కోరు 145* పరుగులు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవలే కౌంటీలు కూడా ఆడి ఉండటం అతనికి కలిసిరానుంది.
ఓపెనర్గా చతేశ్వర్ పుజారాకి మెరుగైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ ఆరు ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా ఆడిన పుజారా 131.66 సగటుతో ఏకంగా 395 పరుగులు చేశాడు. ఓపెనర్గా అతని అత్యధిక స్కోరు 145* పరుగులు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవలే కౌంటీలు కూడా ఆడి ఉండటం అతనికి కలిసిరానుంది.