ఇంగ్లాండ్ గడ్డపై భారత మహిళల జట్టు గొప్ప పోరాట పటిమతో ఆకట్టుకుంది. బ్రిస్టోల్ వేదికగా భారత కాలమాన ప్రకారం శనివారం రాత్రి ఇంగ్లాండ్తో ముగిసిన ఏకైక టెస్టుని డ్రాగా ముగించింది. మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడుతూ ఆఖరి రోజైన శనివారం 83/1తో రెండో ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత్ జట్టులో స్నేహ రాణా (80 నాటౌట్: 154 బంతుల్లో 13x4) అసాధారణ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంది. చివరి సెషన్లో తనియా భాటియా (44 నాటౌట్: 88 బంతుల్లో 6x4)తో అద్భుతంగా ఆడిన స్నేహ రాణా.. 8వ వికెట్కి అజేయంగా 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్లో భారత్ 344/8తో నిలిచిన దశలో ఇక మ్యాచ్ ఫలితం తేలదని భావించిన ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకి అంగీకరించారు. 2014 తర్వాత భారత మహిళల జట్టు మళ్లీ టెస్టు మ్యాచ్ ఆడింది. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు.. కెప్టెన్ హైదర్ నైట్ (95: 175 బంతుల్లో 9x4) శతక సమాన ఇన్నింగ్స్ ఆడటంతో తొలి ఇన్నింగ్స్ని 396/9తో డిక్లేర్ చేసింది. భారత బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ మూడు, పూజా, జులన్ గోస్వామి తలో వికెట్ తీశారు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. ఓపెనర్ షెఫాలి వర్మ (96: 152 బంతుల్లో 13x4, 2x6) దూకుడుగా ఆడినా.. 231 పరుగులకే ఆలౌటైంది. మరో ఓపెనర్ మంధనా (78: 155 బంతుల్లో 14x4)తో కలిసి మొదటి వికెట్కి షెఫాలి వర్మ 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. ఆమె ఔట్ తర్వాత కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు చేజార్చుకున్న భారత జట్టు.. 81.2 ఓవర్లలో 231 పరుగులకి కుప్పకూలిపోయింది. దాంతో.. 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇంగ్లాండ్కి లభించింది.
భారత్ ఆలౌట్ తర్వాత ఇంగ్లాండ్ టీమ్.. మిథాలీ సేనని ఫాలో ఆన్ ఆడించింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్లోనూ షెఫాలి వర్మ (63: 83 బంతుల్లో 11x4, 1x6) టీమ్కి మెరుగైన ఆరంభం అందించింది. ఆమెతో పాటు దీప్తి శర్మ (54: 168 బంతుల్లో 8x4) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్ప్రీత్ కౌర్ (8) రెండో ఇన్నింగ్స్లోనూ తేలిపోయారు. దాంతో.. ఒకానొక దశలో ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓడిపోయేలా కనిపించింది. కానీ.. స్నేహ రాణా, తనియా భాటియా.. ఇంగ్లాండ్ బౌలర్లకి ఎదురు నిలిచి.. వికెట్లని కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. దాంతో.. భారత్ క్రమంగా పుంజుకుని 179 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. స్నేహ రాణా కెరీర్లో ఫస్ట్ సెంచరీ సాధించేలా కనిపించింది. కానీ.. ఆమె 80 పరుగుల వద్ద ఉండగానే మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ నాలుగు రోజులే.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. ఓపెనర్ షెఫాలి వర్మ (96: 152 బంతుల్లో 13x4, 2x6) దూకుడుగా ఆడినా.. 231 పరుగులకే ఆలౌటైంది. మరో ఓపెనర్ మంధనా (78: 155 బంతుల్లో 14x4)తో కలిసి మొదటి వికెట్కి షెఫాలి వర్మ 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. ఆమె ఔట్ తర్వాత కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు చేజార్చుకున్న భారత జట్టు.. 81.2 ఓవర్లలో 231 పరుగులకి కుప్పకూలిపోయింది. దాంతో.. 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఇంగ్లాండ్కి లభించింది.
భారత్ ఆలౌట్ తర్వాత ఇంగ్లాండ్ టీమ్.. మిథాలీ సేనని ఫాలో ఆన్ ఆడించింది. దాంతో.. రెండో ఇన్నింగ్స్లోనూ షెఫాలి వర్మ (63: 83 బంతుల్లో 11x4, 1x6) టీమ్కి మెరుగైన ఆరంభం అందించింది. ఆమెతో పాటు దీప్తి శర్మ (54: 168 బంతుల్లో 8x4) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ మిథాలీ రాజ్ (4), హర్మన్ప్రీత్ కౌర్ (8) రెండో ఇన్నింగ్స్లోనూ తేలిపోయారు. దాంతో.. ఒకానొక దశలో ఇన్నింగ్స్ తేడాతో భారత్ ఓడిపోయేలా కనిపించింది. కానీ.. స్నేహ రాణా, తనియా భాటియా.. ఇంగ్లాండ్ బౌలర్లకి ఎదురు నిలిచి.. వికెట్లని కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. దాంతో.. భారత్ క్రమంగా పుంజుకుని 179 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. స్నేహ రాణా కెరీర్లో ఫస్ట్ సెంచరీ సాధించేలా కనిపించింది. కానీ.. ఆమె 80 పరుగుల వద్ద ఉండగానే మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్టు మ్యాచ్ నాలుగు రోజులే.