కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. బ్యాట్తోనూ, బంతితోనూ సత్తా చాటిన టీమిండియా.. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. బంగ్లా బ్యాటర్లు నాలుగో రోజు కాసేపు పోరాడినప్పటికీ.. భారత బౌలర్లకు తలవంచక తప్పలేదు. ఇక చివరి రోజు 50 నిమిషాల్లోనే 4 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు టెస్టు మ్యాచ్లో ఓటమి చవి చూసింది. కెప్టెన్గా కేఎల్ రాహుల్కు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మూడు ఫార్మాట్లలో పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ కంటే ముందు విదేశీ గడ్డ మీద రాహుల్ కెప్టెన్గా టెస్ట్ విజయాన్ని అందుకున్నాడు.
2022 జనవరిలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా.. ఫిబ్రవరి నెలలో రోహిత్ శర్మకు లాంగ్ ఫార్మాట్లోనూ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ సారథ్యంలో సొంత గడ్డ మీద శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలుపొందింది. తర్వాత జులైలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుకు ముందు రోహిత్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. బుమ్రా కెప్టెన్గా వ్యవహరించగా.. ఆ మ్యాచ్లో టీమిండియా ఓడింది. ఆ తర్వాత భారత్ వన్డేలు, టీ20లపై ఎక్కువగా ఫోకస్ చేసింది.
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గాయపడటంతో.. మూడో వన్డేకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి టెస్టుకు సైతం హిట్ మ్యాన్ దూరం కావడంతో రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా విజయాన్ని అందుకుంది. తద్వారా విదేశాల్లో మూడు ఫార్మాట్లలో విజయాన్ని అందుకున్న కెప్టెన్గా రోహిత్ నిలవడానికి ముందే రాహుల్ నిలిచాడు. ఈ ఏడాది భారత జట్టు విదేశాల్లో గెలిచిన తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. అంతే కాదు కెప్టెన్గా రాహుల్ ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.
దీంతో టెస్టుల్లో రోహిత్ శర్మ కంటే కేఎల్ రాహుల్ మెరుగైన కెప్టెన్ అని.. అతడికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అతడు గెలిచింది తొలి టెస్టు, అది కూడా బంగ్లాదేశ్పైన. రాహుల్ బ్యాటింగ్ ఏ మాత్రం బాగోలేదు. ముందు అతడు పరుగులు చేయాలని సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్పై టెస్టు విజయాన్ని అందుకున్న రాహుల్.. ఆ జట్టు తాము విజయం కోసం చెమటోడ్చేలా చేసిందని అంగీకరించాడు. పిచ్ బౌలర్లకు అంతగా సహకరించికపోయినప్పటికీ.. బౌలర్లు సమర్థతను చాటుకున్నారన్నాడు. మేం మరింత మెరుగ్గా ఆడాల్సిందన్న బాధేమీ తనకు లేదన్నాడు.
Read More Sports News And Telugu News
2022 జనవరిలో సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకోగా.. ఫిబ్రవరి నెలలో రోహిత్ శర్మకు లాంగ్ ఫార్మాట్లోనూ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. రోహిత్ సారథ్యంలో సొంత గడ్డ మీద శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలుపొందింది. తర్వాత జులైలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టుకు ముందు రోహిత్కు కరోనా పాజిటివ్ అని తేలడంతో.. బుమ్రా కెప్టెన్గా వ్యవహరించగా.. ఆ మ్యాచ్లో టీమిండియా ఓడింది. ఆ తర్వాత భారత్ వన్డేలు, టీ20లపై ఎక్కువగా ఫోకస్ చేసింది.
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ గాయపడటంతో.. మూడో వన్డేకు కేఎల్ రాహుల్ కెప్టెన్గా వ్యవహరించాడు. తొలి టెస్టుకు సైతం హిట్ మ్యాన్ దూరం కావడంతో రాహుల్ సారథ్యంలో బరిలోకి దిగిన టీమిండియా విజయాన్ని అందుకుంది. తద్వారా విదేశాల్లో మూడు ఫార్మాట్లలో విజయాన్ని అందుకున్న కెప్టెన్గా రోహిత్ నిలవడానికి ముందే రాహుల్ నిలిచాడు. ఈ ఏడాది భారత జట్టు విదేశాల్లో గెలిచిన తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. అంతే కాదు కెప్టెన్గా రాహుల్ ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.
దీంతో టెస్టుల్లో రోహిత్ శర్మ కంటే కేఎల్ రాహుల్ మెరుగైన కెప్టెన్ అని.. అతడికి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. అతడు గెలిచింది తొలి టెస్టు, అది కూడా బంగ్లాదేశ్పైన. రాహుల్ బ్యాటింగ్ ఏ మాత్రం బాగోలేదు. ముందు అతడు పరుగులు చేయాలని సూచిస్తున్నారు.
బంగ్లాదేశ్పై టెస్టు విజయాన్ని అందుకున్న రాహుల్.. ఆ జట్టు తాము విజయం కోసం చెమటోడ్చేలా చేసిందని అంగీకరించాడు. పిచ్ బౌలర్లకు అంతగా సహకరించికపోయినప్పటికీ.. బౌలర్లు సమర్థతను చాటుకున్నారన్నాడు. మేం మరింత మెరుగ్గా ఆడాల్సిందన్న బాధేమీ తనకు లేదన్నాడు.
Read More Sports News And Telugu News