ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత్ జట్టు మళ్లీ నెం.1 స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్తో అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్, 25 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా.. నాలుగు టెస్టుల సిరీస్ని 3-1తో చేజిక్కించుకుంది. దాంతో.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ 122 పాయింట్లతో భారత్ జట్టు మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ 105 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టుకి ముందు రెండో స్థానంలో ఉన్న భారత్ జట్టు.. 118 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ని వెనక్కి నెట్టేసింది. ఇక 113 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకోగా.. పాకిస్థాన్ (90) ఐదులో నిలిచింది. 2019, ఆగస్టు నుంచి టెస్టుల్లో టీమిండియా 72.2% విజయాల్ని నమోదు చేయగా.. న్యూజిలాండ్ 70.0% మ్యాచ్ల్లో గెలుపొందింది. దాంతో.. ఈ రెండు జట్ల మధ్య ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జూన్ 18 నుంచి 22 వరకూ జరగనుంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్.. ఇంగ్లాండ్ ర్యాంక్..?
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కి అర్హత సాధించిన భారత్ జట్టు.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లోనూ మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్ నాలుగో స్థానంతో సరిపెట్టింది.
Samayam Telugu 6 Mar 2021, 6:03 pm
ప్రధానాంశాలు:
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్
- నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఇంగ్లాండ్
- ఒకటి నుంచి రెండో స్థానానికి పడిపోయిన న్యూజిలాండ్
- భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్లో ఫైనల్ మ్యాచ్