ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు పాయింట్ల పట్టికలో నెం.1 స్థానానికి ఎగబాకింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ పార్చూన్ జెయింట్స్తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 22-19 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ ఘన విజయాన్ని అందుకుంది. టోర్నీలో ఏడో మ్యాచ్ ఆడిన జైపూర్ జట్టుకి ఇది ఆరో విజయంకాగా.. 9వ మ్యాచ్ ఆడిన గుజరాత్కి ఇది ఆరో ఓటమి. ఈరోజు జరిగిన మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ జట్టుపై యు ముంబా విజయాన్ని అందుకుంది. స్టార్ రైడర్ రోహిత్ బలియాన్ 14 సార్లు రైడ్కి వెళ్లి 9 పాయింట్లతో యు ముంబా గెలుపునకి బాటలు వేయగా.. డిఫెండర్ సందీప్ నర్వాల్ నుంచి అతనికి చక్కటి సహకారం లభించింది. మరోవైపు పట్నా రైడర్ పర్దీప్ నర్వాల్ ఆ జట్టుని గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ.. 18 సార్లు రైడ్కి వెళ్లిన ఈ రైడర్ సాధించింది 6 పాయింట్లే. దీంతో.. పట్నాకి ఓటమి తప్పలేదు.
పాయింట్ల పట్టికలో చాలా రోజుల తర్వాత దబాంగ్ ఢిల్లీ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం జైపూర్ జట్టు 30 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీ (26), బెంగాల్ వారియర్స్ (25), యు ముంబా (23), బెంగళూరు బుల్స్ (22), హర్యానా స్టీలర్స్ (21) టాప్-6లో కొనసాగుతున్నాయి. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో.. టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధించనున్నాయి.
పాయింట్ల పట్టికలో చాలా రోజుల తర్వాత దబాంగ్ ఢిల్లీ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం జైపూర్ జట్టు 30 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. ఆ తర్వాత దబాంగ్ ఢిల్లీ (26), బెంగాల్ వారియర్స్ (25), యు ముంబా (23), బెంగళూరు బుల్స్ (22), హర్యానా స్టీలర్స్ (21) టాప్-6లో కొనసాగుతున్నాయి. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో.. టాప్-6లో నిలిచిన జట్లు ప్లేఆఫ్కి అర్హత సాధించనున్నాయి.