రియో ఒలింపిక్స్ లో అద్బుత ప్రతిభతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఓడించి ఫైనల్ కు చేరిన పీవీ సింధు ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన ఐదో అమ్మాయిగా రికార్డులకెక్కింది. అలాగే ఒలింపిక్స్ లో భారత తరఫున బ్యాడ్మింటన్ లో పతకం గెలిచిన అత్యంత చిన్నవయస్కురాలు సింధూనే. నేడు రాత్రి స్పెయిన్ క్రీడాకారిణి కోరోలినా మారిన్ తో సింధు ఫైనల్స్ లో తలపడనుంది. అయితే ఇప్పటికే మనకు రజతం ఖాయమైంది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన మహిళల్లో వెయిట్లిఫ్టిర్ కరణం మల్లేశ్వరి, బాక్సర్ మేరీకోమ్, షట్లర్ సైనా నెహ్వాల్ ఉన్నారు. రీసెంట్ గా రెజ్లర్ సాక్షి మాలిక్ పతకం సాధించింది. ప్రజెంట్ గా పీవీ సింధు ఆ జాబితాలో చేరారు. ఇక ఫైనల్లో నెగ్గి స్వర్ణం సాధిస్తే సింధు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
భారత్ కు మెడల్ అందించిన ఐదో మహిళ సింధు
రియో ఒలింపిక్స్ లో అద్బుత ప్రతిభతో జపాన్ క్రీడాకారిణి ఒకుహరను ఓడించి ఫైనల్ కు చేరిన పీవీ సింధు ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించింది.
BCCL 19 Aug 2016, 7:00 am