యాప్నగరం

ఫేస్‌బుక్ పరిచయం.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక.. విషాదాంతమైన ప్రేమ వివాహం!

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరు మైనర్లు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కానీ కొద్ది రోజులకు అమ్మాయి ఆత్మహత్య చేసుకోగా... ఈ విషయం తెలిసిన అబ్బాయి కూడా రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్‌లోని మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 18 Aug 2022, 8:22 am
సికింద్రాబాద్‌లో మైనర్‌ జంట ప్రేమ వివాహం విషాదాంతమైంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ.. స్నేహితులుగా.. ఆ తర్వా ప్రేమికులుగా మారారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని భావించిన వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాయి. వారిద్దరూ మైనర్లు కావడంతో.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించేశారు.
Samayam Telugu Representative Image
ప్రతీకాత్మక చిత్రం


దీంతో మనస్తాపానికి గురైన మైనర్ బాలిక ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకుంది. బాలిక చనిపోవడంతో ఆవేదనకు గురైన ఆమె ప్రియుడు.. బుధవారం మౌలాలి వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే ప్రేమికులిద్దరూ చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా శ్రద్ధాంజలి పేరిట రూపొందించిన సందేశాన్ని బట్టి అబ్బాయి మైనర్ కాదని తెలుస్తోంది. 12-11-2002న జన్మించినట్లు అందులో పేర్కొన్నారు. మైనార్టీ తీరినప్పటికీ 21 ఏళ్లులోపు వివాహం చేసుకోవడం చట్టపరంగా కుదరదనే సంగతి తెలిసిందే.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.