యాప్నగరం

‘4జీ’నే కావాలంటున్న భారతీయులు!

మొన్న 2జీ, నిన్న 3జీ, నేటి నుంచి 4జీ.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు కూడా ముందుకు నడుస్తున్నారు.

TNN 29 Dec 2016, 12:39 pm
మొన్న 2జీ, నిన్న 3జీ, నేటి నుంచి 4జీ.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలు కూడా ముందుకు నడుస్తున్నారు. కొత్తగా వస్తున్న టెక్ సర్వీసులను అంతే ఉత్సాహంతో ఉపయోగించేస్తున్నారు. ఈ మేరకు హైస్పీడ్ 4జీ నెట్‌వర్క్ లేదా ఎల్‌టీఈని భారత్‌లో రాబోయే 12 నెలల్లో 45 శాతం మంది ఉపయోగించే అవకాశం ఉందని ఓ నివేదిక స్పష్టం చేస్తోంది.
Samayam Telugu 45 indians may opt for 4g in a year says deloitte
‘4జీ’నే కావాలంటున్న భారతీయులు!


వచ్చే ఏడాది కాలంలో దేశంలో 4జీ ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరగనుందని న్యూయార్క్‌కు చెందిన డెలాయిట్ సంస్థ వెల్లడించింది. 59 శాతం మంది భారతీయులు మొబైల్‌లో ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. నిజానికి రిలయన్స్ జియో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తరవాతే 4జీకి డిమాండ్ పెరిగింది. జియో ఉచితంగా 4జీ ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తుండటంతో గతంలో 2జీ, 3జీ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించినవారు 4జీ మొబైళ్లకు మారారు.

దీనికి తోడు జియోకి పోటీగా ఇతర టెలీకాం సంస్థలు కూడా 4జీ సేవలను విస్తృతం చేసాయి. మార్కెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకే లభించడం, 3జీ రేట్లకే 4జీ ఇంటర్నెట్ సేవలు వస్తుండటంతో ఈ ఎల్‌టీఈ నెట్‌వర్క్‌ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోషల్ మీడియా బాగా పాపులర్ కావడం వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ లాంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌ల హవా పెరిగిపోవడంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్‌ను తెగ వాడేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.