యాప్నగరం

ఎయిర్ ఇండియా కొత్త మొబైల్ యాప్

భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ప్రయాణీకుల కోసం కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది.

TNN 25 Oct 2016, 4:36 pm
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ప్రయాణీకుల కోసం కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. గ్లోబల్ టెక్నాలజీ ప్రొవడైర్ ‘సిటా (SITA)’ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ను ఉపయోగించుకుని ప్రయాణీకులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడం, చెక్ఇన్‌తో పాటు ప్రయాణానికి సంబంధించిన అన్ని సౌకర్యాలను సులభంగా పొందవచ్చు. భారత్‌లో మొబైల్ ఆధారిత సర్వీసులకు ప్రాధాన్యత పెరగడం, చాలా ప్రైవేటు ఎయిర్‌లైన్స్ మొబైల్ యాప్‌ల ద్వారా సర్వీసులు అందిస్తుండటంతో 180 లక్షలపైగా ఉన్న తమ ప్రయాణీకుల కోసం ఎయిర్ ఇండియా మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది.
Samayam Telugu air india launches new mobile app flyers can scan passport and credit cards
ఎయిర్ ఇండియా కొత్త మొబైల్ యాప్

సిటా ఐట్రావెల్ ప్లాట్‌ఫాంతో వస్తున్న ఎయిర్ ఇండియా యాప్ ద్వారా విమాన టిక్కెట్లను త్వరగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పాస్‌పోర్టు, క్రెడిట్ కార్డును సురక్షితంగా స్కాన్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికుడు తన బుకింగ్‌కి సంబంధించిన అంశాలను మేనేజ్ చేసుకోవచ్చు. సీట్లను ఎంపిక చేసుకోవడం, ప్రయాణ ప్రణాళికలో మార్పులు, అదనపు సర్వీసుల కొనుగోలు, భోజనం, చెకింగ్ ఇన్ తదితర సర్వీసులు ప్రయాణికుడు ఈ యాప్ ద్వారా పొందే వీలుంది. ఈ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ స్మార్ట్‌ఫోన్లకు అందుబాటులో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.