యాప్నగరం

ఉచిత ఇంటర్నెట్‌కు ‘అలీబాబా’ ప్రయత్నం!

స్మార్ట్‌ఫోన్లలో డాటా వినియోగం అత్యధికంగా ఉన్న భారత్‌లో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ప్రయత్నిస్తోంది.

TNN 9 Feb 2017, 6:02 pm
స్మార్ట్‌ఫోన్లలో డాటా వినియోగం అత్యధికంగా ఉన్న భారత్‌లో ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టెలీకాం ఆపరేట్లరు, వైఫై ప్రొవడైర్లతో ఆ కంపెనీ మంతనాలు జరుపుతోందట. యూసీవెబ్ పేరుతో చైనాలో ఇంటర్నెట్ సర్వీస్ కంపెనీని నడుపుతున్న అలీబాబా.. ఇప్పుడు భారత్ మార్కెట్‌పై కన్నేసింది. అక్కడ బాగా పాపులర్ అయిన యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు ఈ ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి రెడీ అయింది.
Samayam Telugu alibaba wants to provide free internet in india report
ఉచిత ఇంటర్నెట్‌కు ‘అలీబాబా’ ప్రయత్నం!


అయితే గతంలో ఫేస్‌బుక్ కూడా ఇలాంటి ఉచిత ఇంటర్నెట్ సర్వీసులనే భారత్ తీసుకొచ్చింది. రిలయన్స్‌లో కలసి ఇంటర్నెట్.ఓఆర్జీతో పాటు స్వయంగా ఫ్రీ బేసిక్స్ పేరుతో ఫేస్‌బుక్ ఉచిత ఇంటర్నెట్ సేవలను అందించే ప్రయత్నం చేసింది. అయితే ఫేస్‌బుక్ ప్రయత్నానికి టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అడ్డుపడింది. ఉచిత ఇంటర్నెట్ పేరుతో పరిమిత అప్లికేషన్లకే ఫ్రీగా ఇంటర్నెట్ కల్పిస్తే అది నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధమని ఫేస్‌బుక్ ప్రతిపాదనను తోసిపుచ్చింది.

ప్రస్తుతం అలీబాబా ఫ్రీ ఇంటర్నెట్‌పై కూడా ఇలాంటి ఊహాగానాలే వినిపిస్తున్నాయి. యూసీ బ్రౌజర్‌ను ఇండియాలో పాపులర్ చేయడానికి దానిలో లభించే పరిమిత వెబ్‌సైట్లపై మాత్రమే ఉచిత ఇంటర్నెట్ కల్పిస్తారని చెప్పుకుంటున్నారు. అలానే జరిగితే అలీబాబా ప్రయత్నానికి కూడా ట్రాయ్ అడ్డుపడటం ఖాయం. అయితే అలీబాబా గ్రూప్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ ఉచిత ఇంటర్నెట్‌పై త్వరలో అలీబాబా గ్రూప్ వివరణ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.