యాప్నగరం

అనంతపురం: కొంప ముంచిన పెళ్లి విందు.. 13మందికి అస్వస్థత

బాధితుల్ని అర్థరాత్రి సమయంలో వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Samayam Telugu 4 Jan 2021, 9:09 am
అనంతపురం జిల్లాలో పెళ్లి విందు కొంప ముంచింది. సోమందేపల్లి మండలం మండ్లిలో పెళ్లి వేడుకలో ఫుడ్ పాయిజన్ కలకలంరేపింది.పెళ్లి భోజనం తిని ఆరుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మరో ఏడుగురికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. బాధితుల్ని అర్థరాత్రి సమయంలో వెంటనే హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Samayam Telugu ఫుడ్ పాయిజన్ (File Photo)


పెళ్లి విందులో భోజనం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆ పదార్థాల శాంపిల్స్‌ను కూడా సేకరించారు.. రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉండటంతో ఆందోళన వ్యక్తమైంది.. కానీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.