అనంతపురం మార్కెట్ యార్డ్.. ముగ్గురు వ్యక్తులు లుంగీ, పాత చొక్కా.. మెడలో తువ్వాలుతో లోపలికి వెళ్లారు. గొర్రెలు, ఎద్దులు కొనడానికి వచ్చారని అధికారులు భావించారు. కొద్దిసేపటికి అసలు విషయం బయటపడింది.. వచ్చింది ఏసీబీ అధికారులని తెలిసి అవాక్కయ్యారు. అవినీతి చేసేవారిని పట్టుకునేందుకు ఇలా మారు వేషంలో వెళ్లారని తేలింది. మార్కెట్ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో.. యార్డులో జరుగుతున్న తతంగం మొత్తంపై ఆరా తీసి వారి ఆటకట్టించారు. ఏసీబీ అధికారులు మార్కెట్ యార్డు కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. భారీగా అవకతవకలు జరిగినట్లు బయటపడింది. శని, ఆదివారాల్లో గొర్రెలు, ఎద్దుల్ని అమ్మకాల సమయంలో అక్రమాలు చేసినట్లు తెలుస్తోంది. మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారని గుర్తించి.. ఉద్యోగుల దగ్గర ఉన్న అనధికార సొమ్ము, బిల్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. సూపర్వైజర్లు, సిబ్బంది ఒక్కొక్కరిని ప్రశ్నించారు.
బిల్లుల్లో రూ.30వేల వ్యత్యాసమున్నట్లు అధికారులు తేల్చారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్కు వాట్సాప్ ఫిర్యాదులు, స్పందనలో మార్కెట్ కమిటీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సంతలో ఫీజు వసూళ్లకు సంబంధించి చాలావరకు రసీదులు ఇవ్వ కుండానే డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే మారు వేషాల్లో వచ్చి ఈ సోదాలు చేశారు.
బిల్లుల్లో రూ.30వేల వ్యత్యాసమున్నట్లు అధికారులు తేల్చారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్కు వాట్సాప్ ఫిర్యాదులు, స్పందనలో మార్కెట్ కమిటీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. సంతలో ఫీజు వసూళ్లకు సంబంధించి చాలావరకు రసీదులు ఇవ్వ కుండానే డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలోనే మారు వేషాల్లో వచ్చి ఈ సోదాలు చేశారు.