యాప్నగరం

అనంతపురం: సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా బస్సు

విద్యార్థులు నాగిరెడ్డిపల్లి, గొంచిరెడ్డిపల్లి గ్రామాల నుంచి బ్రహ్మసముద్రం దాకా 10 కిలోమీటర్ల కాలినడకన స్కూల్‌కు వెళుతున్నారు. తమ సమస్యపై బాలికలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samayam Telugu 22 Jan 2021, 12:22 pm
అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. విద్యార్థుల కష్టాలు చూసి వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సును వేయించారు. విద్యార్థులు నాగిరెడ్డిపల్లి, గొంచిరెడ్డిపల్లి గ్రామాల నుంచి బ్రహ్మసముద్రం దాకా 10 కిలోమీటర్ల కాలినడక
Samayam Telugu అనంతపురం జిల్లా

న స్కూల్‌కు వెళుతున్నారు. తమ సమస్యపై బాలికలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ సమస్యను వివరించారు..
బాలికల ఫేస్ బుక్ పోస్ట్‌ను కలెక్టర్ గంధం చంద్రుడు గమనించారు.

వెంటనే ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు.. నాగిరెడ్డిపల్లి, గొంచిరెడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి బాలికలతో మాట్లాడారు. కలెక్టర్ చొరవ తీసుకుని ఆ బాలికలు స్కూలుకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో గంధం చంద్రుడు ప్రయాణించారు.. వారి సమస్యల్ని కూడా అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యపై స్పందించి పరిష్కరించినందుకు బాలికలు హర్షం వ్యక్తం చేశారు.. కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.