యాప్నగరం

అనంతపురం: వార్డు సభ్యుడిగా ఉదయం ప్రమాణ స్వీకారం, రాత్రికి.. షాకింగ్!

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వార్డు సభ్యుడిగా గెలిచిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే..!

Samayam Telugu 4 Apr 2021, 4:41 pm
పంచాయతీ ఎన్నికల్లో ఆయన వార్డు సభ్యుడిగా గెలిచిన వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడు. శనివారం ఉదయం వార్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి.. రాత్రికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Samayam Telugu ఎరికలరెడ్డి ఆత్మహత్య


అనంతపురం జిల్లా యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన ఎరికల రెడ్డి (42) పంచాయతీ 3వ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ తరుణంలో శనివారం ఉదయం వార్డు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే రాత్రి కళ్లంలోని చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పొందాడు. బహిర్భూమికని వెళ్లిన అతని తండ్రి చెట్టుకు ఏదో వేలాడుతున్నట్లు అనిపించి టార్చిలైటు వేసి చూశారు. తన కుమారుడేనని గుర్తించి కేకలు వేశారు.

బంధువులు, గ్రామస్థులు వచ్చి కిందికి దించి చూడగా అప్పటికే ఎరికల రెడ్డి మృతిచెందారు. వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎరికలరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.