యాప్నగరం

నలుగురిని మింగేసిన చెరువు: పెనుకొండలో పెను విషాదం

అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. చెరువులో మునిగి నలుగురు కన్నుమూశారు.

Samayam Telugu 14 Mar 2021, 7:31 pm
అనంతపురం జిల్లా, పెనుకొండలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఈత సరదా బలి తీసుకుంది. అనంతపురం పట్టణంలోని సూర్యానగర్‌కు చెందిన నలుగురు వ్యక్తులు పెనుకొండ పరిధిలోని భోగసముద్రం చెరువులో ఈత కొట్టేందుకు దిగగా, అందరూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Samayam Telugu పెనుకొండలో విషాదం


వెంటనే రంగంలోకి దిగిన గజఈతగాళ్లను చెరువులోకి దించగా, ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దురదృష్టకరంగా నలుగురు దుర్మరణం చెందారు. దీంతొ చెరువులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చనిపోయినవారు తస్లీమా (14), సాధిక్ (40), అల్లాబక్ష్ (45), పాషా (17)గా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడటంతో సూర్యానగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.