యాప్నగరం

అనంతపురం: పరిటాల సునీతకు షాక్.. ఆయన వైసీపీలోకి

జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీ అభ్యర్థి ఇలా అధికార పార్టీలో చేరడం పరిటాల సునీతకు ఎదురు దెబ్బగా చెప్పాలి. ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరిక.

Samayam Telugu 9 Mar 2021, 6:52 am
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. కనగానపల్లి టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రామలింగయ్య టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌‌సీపీలో చేరారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ టీడీపీ అభ్యర్థి ఇలా అధికార పార్టీలో చేరడం పరిటాల సునీతకు ఎదురు దెబ్బగా చెప్పాలి. దీంతో కనగానపల్లిలో టీడీపీకి జెడ్పీటీసీ అభ్యర్థి లేకుండా పోయారు.
Samayam Telugu పరిటాల సునీత


అంతేకాదు మున్సిపల్‌ ఎన్నికల వేళ టీడీపీ నుంచి పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ సర్పంచ్‌గా ఎంపీపీగా పనిచేసిన కేఎస్‌ ఫైరోజ్‌ బేగం, ఆమె భర్త జిల్లా టీడీపీ సీనియర్‌ నాయకులు కేఎస్‌ ఉమర్‌తో పాటు మరికొంతమంది వైఎస్సార్‌సీపీలో చేరారు. స్ధానిక సంస్థల ఎన్నికలవేళ ఇలా నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం కలకలంరేపుతోంది. ధర్మవరంలో కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొంతమంది టీడీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే అనుమానంతో నియోజకవర్గ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ జాగ్రత్తపడ్డారు. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు వరకు అభ్యర్థులను క్యాంప్‌లకు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.