అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకం కలకలంరేపింది. గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు దొరికిపోయారు. కదిరి నిజాంవలి కాలనీకి చెందిన మస్తాన్ అనారోగ్యంతో ఉన్నవారికి యంత్రాలు కడుతూ జీవిస్తున్నాడు. తనకు గుప్త నిధులున్న ప్రాంతాలు తెలుసని వరుసకు సోదరి అయ్యే మహిళతో చర్చించాడు. ఆమె తన ఇంట్లో నిధులున్నాయని చెప్పడంతో మస్తాన్కు గుప్త నిధులపై ఆశ పుట్టింది.. ఎలాగైన తవ్వకాలు జరపాలని నిర్ణయించాడు. మస్తాన్ తనకు పరిచయమున్న మరో ఐదుగుర్ని వెంటపెట్టుకుని రాత్రి సమయంలో మహిళ ఇంట్లో తవ్వకాలు చేపట్టారు. ఇంట్లో నుంచి రాత్రిళ్లు శబ్దాలు వస్తుండటంతో స్థానికులు గమనించారు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇంటి యజమాని మహిళతో పాటూ ఏడుగురిని అరెస్టు చేశారు. తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో కొద్దిరోజులుగా గుప్త నిధుల తవ్వకాల ముఠాలు రెచ్చిపోతున్నారు. గత వారం కొన్ని ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. నిఘా కూడా పెంచారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొన్ని ముఠాలు వచ్చి మెటల్ డిటెక్టర్లతో పొలాల్లో వెతుకుతున్నారు.
అనంతపురం: రాత్రిళ్లు ఓ ఇంట్లో నుంచి వింత శబ్దాలు.. స్థానికులకు అనుమానం, లోపల సీన్ చూసి షాక్!
ఇంట్లో నుంచి రాత్రిళ్లు శబ్దాలు వస్తుండటంతో స్థానికులు గమనించారు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇంటి యజమాని మహిళతో పాటూ ఏడుగురిని అరెస్టు చేశారు.
Samayam Telugu 25 Aug 2021, 11:04 am
ప్రధానాంశాలు:
- అనంతపురం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు
- కదిరిలోని ఓ ఇంట్లో తవ్వుతూ దొరికిపోయారు
- కొద్ది రోజులుగా గుప్త నిధుల ముఠాల హల్చల్