అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి జేసీ బ్రదర్స్ హవా కొనసాగింది. మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో టీడీపీ మళ్లీ పైచేయి సాధించింది. టీడీపీకి చెందిన ముస్తాక్ అహ్మద్, షమీమ్, బింగి ప్రభాకర్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. టీడీపీ సభ్యులు ఎన్నిక తర్వాత కౌన్సిల్ హాల్ను వైఎస్సార్సీపీ సభ్యులు బాయ్కట్ చేసి వెళ్లిపోయారు. ముగ్గురు కో ఆప్షన్ సభ్యుల్ని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అభినందించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా తాడిపత్రి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ఆసక్తి రేపింది. తాడిపత్రిలో మొత్తం 36 వార్డులుండగా టీడీపీ 18చోట్ల.. వైఎస్సార్సీపీ 16 చోట్ల విజయం సాధించాయి. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి చెరొక చోట గెలిచారు. ఇక్కడ స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ తలారీ రంగయ్య ఓటుతో కలిపితే వైఎస్సార్సీపీ బలం 18కు చేరింది. ఇక టీడీపీకి 18మంది కౌన్సిలర్లు.. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 20కు చేరింది. దీంతో ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు.
ఆ తర్వాత మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. ఈ పదవి కోసం వైసీపీ ప్రయత్నించినా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలతో సాధ్యం కాలేదు.. కౌన్సిల్ హాల్కు వెళ్లకుండానే చక్రం తిప్పారు. అనూహ్యంగా వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ గైర్హాజరు కావడంతో నాలుగో వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్కు పదవి దక్కింది. ఎలాంటి నెంబర్ గేమ్ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు కో ఆప్షన్ పదవుల్ని కూడా టీడీపీ దక్కించుకుంది.
ఆ తర్వాత మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. ఈ పదవి కోసం వైసీపీ ప్రయత్నించినా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలతో సాధ్యం కాలేదు.. కౌన్సిల్ హాల్కు వెళ్లకుండానే చక్రం తిప్పారు. అనూహ్యంగా వైస్ చైర్మన్ ఎన్నికకు వైసీపీ గైర్హాజరు కావడంతో నాలుగో వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్కు పదవి దక్కింది. ఎలాంటి నెంబర్ గేమ్ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు కో ఆప్షన్ పదవుల్ని కూడా టీడీపీ దక్కించుకుంది.