యాప్నగరం

రహదారి కోసం తవ్వితే, స్తంభాలు వెలుగులోకి.. భారీగా తరలివచ్చిన జనం

Anantapur జిల్లాలో రహదారి పనుల కోసం తవ్వుతుండగా.. ఆలయ స్తంభాలు బయటపడ్డాయి. చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్ట్ నుంచి సిరా వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో..

Samayam Telugu 16 Jan 2022, 2:02 pm
అనంతపురం జిల్లాలో రహదారి పనుల కోసం తవ్వుతుండగా.. ఆలయ స్తంభాలు బయటపడ్డాయి. చిలమత్తూరు మండలంలోని కొడికొండ చెక్‌పోస్ట్ నుంచి సిరా వరకు నిర్మిస్తున్న రోడ్డు పనుల్లో.. ఎస్సార్సీ కాంట్రాక్టర్లు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో అక్కడ అతి పురాతన మైన దేవాలయ ఆనవాళ్లు కలిగిన స్తంభాలు బయటపడ్డాయి.
Samayam Telugu బయటపడ్డ ఆలయ స్తంభాలు


ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ దేవాలయం గతంలో ఉండేదని.. గ్రామ పెద్దలు తెలుపుతున్నారు. అయితే ఆలయ స్తంభాలను గుట్టుచప్పుడు కాకుండా వాటిపై మట్టిని కప్పే ప్రయత్నం చేశారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. పురావస్తు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆలయ స్తంభాలు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దేవాలయ ప్రాముఖ్యత గురించి చర్చించుకుంటున్నారు. లేపాక్షి ఆలయ సమీపంలోనే రాతి స్తంభాలు బయటపడడంతో.. 16వ శతాబ్దానికి సంబంధించినవి అని స్థానికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.