యాప్నగరం

అనంతపురం: భర్తకు బ్యాంక్ ఉద్యోగం, సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఆయన రూమ్ డోర్ తీయగానే, ఊహించని ఘటన!

సుజన తండ్రి మాత్రం అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండేవారని.. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆమె తండ్రి కొండలు ధర్మవరం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 24 Jan 2022, 11:12 am

ప్రధానాంశాలు:

  • అనంతపురం జిల్లా ధర్మవరంలో ఘటన
  • ఇంట్లోనే ఉరి వేసుకున్న సుజన
  • సుజన మరణంపై తండ్రి అనుమానాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అనంతపురం జిల్లా
భర్తకు బ్యాంక్ ఉద్యోగం.. ఇద్దరు కూతుర్లు.. సాఫీగా సాగిపోతున్న జీవితం. ఇంతలో ఏం జరిగిందో వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఘటన విషాదాన్ని నింపింది. పట్టణంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ తాడిమర్రిలోని ఎస్‌బీఐ శాఖలో పనిచేస్తున్నారు. 2016లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండయ్య, గంగాదేవి దంపతుల కుమార్తె వెంకట సుజనతో వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు.
ఇంతలో ఏం జరిగిందో ఏమో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటిపైన మూడో అంతస్తులో సుజన ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా సుజన, వెంకటకృష్ణ మధ్య గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

సుజన తండ్రి మాత్రం అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండేవారని.. కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆమె తండ్రి కొండలు ధర్మవరం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటకృష్ణ కుటుంబసభ్యులతో మృతురాలి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఈ మరణంపై పోలీసులు విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ వెంకటకృష్ణ ఇంటి దగ్గర బైఠాయించారు. ధర్మవరం డీఎస్సీ, పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేస్తామని వారికి హామీ ఇచ్చారు.. కేసు నమోదు చేశారు. మృతురాలి భర్తను ప్రశ్నిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.