అనంతపురం: ముళ్ల కంపలపై పడుకుని.. ఇదెక్కడి వింత ఆచారం
Beluguppa Jatara రెండు రోజుల పాటూ ఘనంగా జరిగింది. జాతరను తిలకించేందుకు కర్ణాటక సరిహద్దు నుంచి భక్తులు భారీగా తరలి వస్తారు.. మొక్కులు చెల్లించుకుంటారు.
మనకు చిన్న ముల్లు గుచ్చుకుంటే తట్టుకోలేము.. అలాంటి ముళ్ల కంపలపై పడుకుంటే పరిస్థితి ఏంటి. తలచుకుంటేనే భయం వేస్తోంది కదూ.. అనంతపురం జిల్లాలో వింత ఆచారం ఆసక్తికరంగా మారింది. ఈ జాతరలో పూజారి గుట్టగా వేసిన ముళ్ల కంపలపై ఎక్కి ఏకంగా పడుకుంటారు. అంతేకాదు గాలిలో పొడవాటి కర్ర పై పూజారిని కట్టి వలయాకారంలో తిప్పడం కూడా ఇక్కడ వింత ఆచారం. బెలుగుప్ప మండలం బెలుగుప్ప తాండలో మారెమ్మ జాతర వినూత్నంగా సాగుతుంది. ఈ వేడుకను రెండు రోజుల పాటు వైభవంగా జరిగింది. ఈ జాతరకు ఉరవకొండతో పాటూ కర్ణాటక సరిహద్దు నుంచి గిరిజనులు వస్తారు.. జాతరను తిలకించేందుకు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా వేలాదిమంది ఇలా వస్తుంటారు. ఉదయం మహిళలచే పూర్ణ కుంభ కలశాలతో ఊరేగింపుతో ప్రారంభమైన ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఈ మారెమ్మ జాతరలో ఆలయ పూజారి పెద్ద గుట్టగా వేసిన ముళ్ల కంపలను ఎక్కుతూ వెళ్లి అటువైపు ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు.. ఆ తర్వాత పదునైన ముళ్లపై పడుకొంటాడు.
ఒళ్లు గగుర్పొడిచే డప్పు భక్తుల కేకల మధ్య ఈ ప్రధాన ఘట్టం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఇరుసు లాంటి ఏర్పాటులో పెద్ద కర్రకు పూజారిని కట్టి గాలిలో వలయాకారంలో సిరిమానోత్సవం కార్యక్రమం వంటి ఘట్టాలు తిలకించడానికి భక్తులు తరలి వచ్చారు. సాంప్రదాయంగా కొన్ని తరాలుగా వస్తోన్న ఈ ఆచారం చూడటం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ఈ కార్యక్రమాలలో పదునైన ముళ్ల కంపలపై పడుకుని పూజారి పూల పాన్పుపై పడుకున్నట్టుగా ఫోజులిచ్చారు. ఈ జాతర ఆ చుట్టపక్కల ప్రాంతంలో బాగా ప్రసిద్ధి.
ఒళ్లు గగుర్పొడిచే డప్పు భక్తుల కేకల మధ్య ఈ ప్రధాన ఘట్టం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ఇరుసు లాంటి ఏర్పాటులో పెద్ద కర్రకు పూజారిని కట్టి గాలిలో వలయాకారంలో సిరిమానోత్సవం కార్యక్రమం వంటి ఘట్టాలు తిలకించడానికి భక్తులు తరలి వచ్చారు. సాంప్రదాయంగా కొన్ని తరాలుగా వస్తోన్న ఈ ఆచారం చూడటం కోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. ఈ కార్యక్రమాలలో పదునైన ముళ్ల కంపలపై పడుకుని పూజారి పూల పాన్పుపై పడుకున్నట్టుగా ఫోజులిచ్చారు. ఈ జాతర ఆ చుట్టపక్కల ప్రాంతంలో బాగా ప్రసిద్ధి.