యాప్నగరం

కాంగ్రెస్ టాప్ లీడర్.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలో.. మురికిని చేత్తో ఎత్తేసి.. అంతా అవాక్కు!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఎన్.రఘువీరారెడ్డి ఆధ్యాత్మిక బాట పట్టారు. చేతులతోనే మురికిని ఎత్తివేసి శ్రమదానం చేశారు.

Samayam Telugu 23 Aug 2021, 8:26 pm
పదేళ్ల ముందు అనంతపురం జిల్లాలో ఆయనో తిరుగులేని నాయకుడు! ఏడాది ముందు వరకు కూడా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు! ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుచరులు ఉన్న నాయకుడు! కానీ, ఇప్పుడు అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపిస్తూ అందరినీ ఆయన ఆశ్చర్యపరుస్తున్నారు. నెరిసిన గడ్డంతో, పక్కా పల్లెటూరి రైతులా మారిపోయారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో తలమునకలైన ఆయన.. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటపట్టారు. ఆయనే ఎన్.రఘువీరారెడ్డి..!!
Samayam Telugu రఘువీరారెడ్డి శ్రమదానం


2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా.. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లపాటు ఏపీసీపీ అధ్యక్షుడిగా రఘువీరా కొనసాగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి, ఏపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిన తర్వాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీరా.. అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపిస్తున్నారు. ఇటీవలే సొంత గ్రామం నీలకంఠాపురంలో చారిత్రక నీలకంటేశ్వర దేవస్థానాన్ని పునర్‌నిర్మించారు.

ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఉన్న రఘువీరారెడ్డి.. సోమవారం నెల్లూరు జిల్లా పెంచలకోనలోని కణ్వ ఆశ్రమమంలో సిద్ధ సమాజ యోగా సాధన చేపట్టారు. ఇందులో భాగంగా ఆఖరి రోజు వ్యర్థాలు శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నారు. రఘువీరారెడ్డి స్వయంగా చేతితో మురుగును ఎత్తివేశారు. ఈ మేరకు రఘువీరా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘కోన అటవీ ప్రాంతంలో కణ్వ ఆశ్రమమంలో సిద్ద సమాజ యోగా , ప్రో. సదాశివ రెడ్డి మురళీధరరావు గార్ల ఆధ్వర్యంలో నిత్యసమాధి యోగా లో భాగంగా ఆఖరి రోజు వ్యర్థాలు శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొన్నాము.’’ అంటూ రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.