ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై దాడి.. సత్య కుమార్ పరామర్శ.. సోము వీర్రాజు సీరియస్!
Dharamvaram Press Club Attack | ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ప్రెస్ క్లబ్లో వారిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు అనంతపురం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దాడి చేసింది వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
ప్రధానాంశాలు:
- ధర్మవరంలో బీజేపీ కార్యకర్తలపై దాడి
- ఆరుగురికి గాయాలు, అనంతపురం తరలింపు
- పరామర్శించిన సత్య కుమార్, దాడి ఘటనపై సోము సీరియస్
పుట్టపర్తి జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. కిమ్స్ సవేరాలో చికిత్స పొందుతున్న వారిని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ పరామర్శించారు. గాయపడిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని.. అధికార పార్టీ గూండాయిజాన్ని ఖండిస్తున్నానన్న సత్య కుమార్.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసలేం జరిగిందంటే..?
ధర్మవరంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. బీజేపీ నేతలు ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఖండించారు.
ధర్మవరంలో తమ పార్టీ నాయకులపై దాడి జరిగిన విషయం తెలియగానే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో ఫోన్లో మాట్లాడారు. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని సూరీ తనతో చెప్పారని వీర్రాజు తెలిపారు. తమ కార్యకర్తలపై దాడికి ఎమ్మెల్యేనే కారణం అని సోము వీర్రాజు ఆరోపించారు. ఈ విషయమై డీఐజీ, ఎస్పీలతో తాను మాట్లాడానన్నారు.
సీఎం జగన్ వెంటే ఈ విషయంలో స్పందించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. వ్యక్తులను టార్గెట్ చేసి, హింసించడాన్ని తమ పార్టీ సహించబోదన్నారు. ఈ తరహా ఘటనలు పురావృతమైతే.. బీజేపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.
ధర్మవరంలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. బీజేపీ నేతలు ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఖండించారు.
సీఎం జగన్ వెంటే ఈ విషయంలో స్పందించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. వ్యక్తులను టార్గెట్ చేసి, హింసించడాన్ని తమ పార్టీ సహించబోదన్నారు. ఈ తరహా ఘటనలు పురావృతమైతే.. బీజేపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.