యాప్నగరం

‘సరిగా పుట్టిన నా కొడుకు ఎవరైనా’.. భూ కబ్జా ఆరోపణలపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Dharmavaram MLA కేతిరెడ్డి ప్రతిపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను రోడ్లు వేసినా.. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహించినా.. భూ కబ్జాలకు పాల్పడుతున్నానని ఆరోపిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తానే మళ్లీ ధర్మవరం నుంచి గెలవబోతున్నానని కేతిరెడ్డి తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 28 Jun 2022, 5:47 pm

ప్రధానాంశాలు:

  • తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ఖండించిన కేతిరెడ్డి
  • రోడ్లు వేస్తే కబ్జా చేస్తున్నా అంటున్నారని ఆవేదన
  • ప్రతిపక్ష నేతపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kethireddy
Kethireddy
తనపై ప్రతిపక్షాలు చేస్తున్న భూకబ్జా ఆరోపణలపై ధర్మవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి వెళ్తే.. కబ్జాలకు పాల్పడుతున్నానని ఆరోపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎవరైనా రోడ్డు వేస్తే కబ్జా ఎలా అవుతుందని కేతిరెడ్డి ప్రశ్నించారు... సరిగా పుట్టిన నా కొడుకు.. వీళ్లలో ఏ పార్టీ వాళ్లైనా గానీ.. నేను అర్ధ అడుగు కబ్జా చేసినట్టు నిరూపించాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఎన్నికలంటే ఓట్లేసుకొని పక్కకు ఎక్కడికో పారిపోవడం కాదు.. జనాల దగ్గరకు రావాలి.. వారి సమస్యలు తెలుసుకోవాలని కేతిరెడ్డి హితవు పలికారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏదో చేస్తానని అంటున్నావ్ కదా.. మేం వెయిట్ చేస్తున్నాం.. రా అంటూ పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ధర్మవరంలోని శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీకి ధర్మవరం నియోజకవర్గంలో నాయకుడు లేడన్న కేతిరెడ్డి.. అయినా ఎంతో సహనంతో తమ నాయకులు, కార్యకర్తలను అదుపులో ఉంచుకుని ప్రగతి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. లేదంటే పల్లెల్లో తరిమి కొట్టే పరిస్థితి ఉండేదన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా.. ఈసారి కూడా తాను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని కేతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఆది సినిమాలో అస్సాం రైలులాగే... తాను ధర్మవరం ఎమ్మెల్యేగా గెలవగానే.. రెండు నెలలకే ఓడిన వ్యక్తి అస్సాం పార్శల్ అయ్యాడని కేతిరెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి నా గురించి తప్పుడు మాటలు మాట్లాడటం సరి కాదన్నారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.