ఏపీ మాజీ మంత్రి సంచలన ప్రకటన చేశారు. మళ్లీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాను అంటున్నారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుందామనుకున్నానని.. కానీ కొన్ని పరిణామాలతో తన మనసు మార్చుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ప్రధాని మోదీని ఒక్క మాట అన్నందుకే.. ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం బాధ కలిగించింది అన్నారు. మనసును కలచివేయడంతో.. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోవడం భావ్యమా అని ఆలోచించాను అన్నారు. అందుకే తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు. తన సొంత గ్రామం నీలకంఠాపురంలో ఆలయ నిర్మాణం కోసం నాలుగేళ్లుగా రాజకీయాల నుంచి విరామం తీసుకున్నట్లు రఘువీరా చెప్పారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని.. కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాను అన్నారు. తనను పార్టీ బెంగళూరు నగర ఎన్నికల పరిశీలకుడిగా నియమించిందని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లి అక్కడి అభ్యర్థుల విజయం కోసం తనవంతుగా కృషి చేస్తానన్నారు. రాహుల్ను అవమానించడం వల్లే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్కు పట్టం కడతారని చెప్పారు. తనను అభిమానించేవారు చెప్పినట్లుగా భవిష్యత్తులో నడుచుకుంటాను అన్నారు.
రఘువీరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఆయన మడకశిర నుంచిమూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణిజేటీ రోశయ్య ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగారు. అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర విభజన తర్వత రఘువీరాకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఊరిలో ఆలయ నిర్మాణం పనుల్లో బిజీ అయ్యారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని భావించారు.. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది చూడాలి. ఇటు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇలాంటి సమయంలో రఘువీరారెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
రఘువీరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఆయన మడకశిర నుంచిమూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆయన కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కొణిజేటీ రోశయ్య ప్రభుత్వంలో కూడా మంత్రిగా కొనసాగారు. అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు.
రాష్ట్ర విభజన తర్వత రఘువీరాకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తన ఊరిలో ఆలయ నిర్మాణం పనుల్లో బిజీ అయ్యారు. దీంతో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రారని భావించారు.. కానీ ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది చూడాలి. ఇటు ఇటీవల మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇలాంటి సమయంలో రఘువీరారెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
- Read Latest Andhra Pradesh News and Telugu News