సాధారణంగా చీమల గుట్టలు చూసి ఉంటాం.. గొర్రెల గుంపును చూసుంటాం.. కానీ, గుట్టలకొద్దీ పాముల్ని చూశారా? ఊహిస్తేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! పొలంలో వందల సంఖ్యలో ఒకే చోట ఉన్న పాముల మందని చూసి రైతుల గుండెలు గుభేల్మన్నాయి. ఆ పొలంలో రోజూ మాదిరిగానే వరి నాట్లు వేయడానికి కూలీలు వచ్చారు. ఎవరి పనిలోకి వారు దిగుదామనుకుంటున్న సమయంలో.. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి.
ఎక్కడ చూసినా గుట్టలు, గుట్టలుగా పాములు కనిపించాయి. దీంతో అడ్కడున్న వారంతా భయంతో బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని గుర్రబ్బాడు గ్రామంలో చోటు చేసుకుంది.
గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు తన పొలంలో వరి నారు వేశాడు. పురుగు పుట్రా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త కోసం థిమ్మెట్ ద్రావణం పిచికారీ చేసి అందులో నీళ్లు నింపాడు. ఇక రెండు రోజుల తర్వాత పొలం వద్దకు వెళ్లి చూడగా వరిమడిలో కొన్ని పాములు చచ్చిపోయి నీటిలో తేలాడుతూ కనిపించాయి.
దీంతో అప్రమత్తమైన రామాంజనేయులు ఇంకా ఏమైనా పాములు ఉన్నాయేమోనన్న అనుమానంతో మడిలోని నీటిని బయటికి తోడాడు. అంతే, లోపల సీన్ చూసి ఆయన తలలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. పదుల సంఖ్యలో చచ్చిన పాములతో పాటు మరికొన్ని బ్రతికున్న పాములు ఉన్నాయి. పొలంలో అడుగుపెడితే ఎక్కడ కాటు వేస్తాయోనని గ్రహించి మెల్లగా కర్ర సహాయంతో వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసి బ్రతికి ఉన్న వాటిని కూడా చంపేశాడు.
ఈ విషయంపై రైతు రామాంజనేయులు మాట్లాడుతూ.. పొలాల్లో పాములు ఉండడం సహజమని.. కానీ ఒక్క మడిలోనే ఏకంగా వందకు పైగా పాములు ఒకేసారి, ఒకేచోట చూడడం తన జీవితంలో ఇదే మొదటిసారని తెలిపారు. నారుమడి వేయక ముందు పాములు వచ్చి చేరాయో లేక పక్కనే ఉన్న వంక నుంచి వచ్చాయో కానీ పొలంలో తాము ముందే గుర్తించకపోయి ఉంటే తనతో పాటు కూలీలు కూడా పాము కాటుకు గురై ఉండేవాళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, పాములు ఉన్నాయని వ్యవసాయం వదులుకోలేం కదా అంటూ రామాంజనేయులు నిట్టూర్చారు.
ఎక్కడ చూసినా గుట్టలు, గుట్టలుగా పాములు కనిపించాయి. దీంతో అడ్కడున్న వారంతా భయంతో బెంబేలెత్తిపోయారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని గుర్రబ్బాడు గ్రామంలో చోటు చేసుకుంది.
గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే రైతు తన పొలంలో వరి నారు వేశాడు. పురుగు పుట్రా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త కోసం థిమ్మెట్ ద్రావణం పిచికారీ చేసి అందులో నీళ్లు నింపాడు. ఇక రెండు రోజుల తర్వాత పొలం వద్దకు వెళ్లి చూడగా వరిమడిలో కొన్ని పాములు చచ్చిపోయి నీటిలో తేలాడుతూ కనిపించాయి.
దీంతో అప్రమత్తమైన రామాంజనేయులు ఇంకా ఏమైనా పాములు ఉన్నాయేమోనన్న అనుమానంతో మడిలోని నీటిని బయటికి తోడాడు. అంతే, లోపల సీన్ చూసి ఆయన తలలో ఫ్యూజులు ఎగిరిపోయాయి. పదుల సంఖ్యలో చచ్చిన పాములతో పాటు మరికొన్ని బ్రతికున్న పాములు ఉన్నాయి. పొలంలో అడుగుపెడితే ఎక్కడ కాటు వేస్తాయోనని గ్రహించి మెల్లగా కర్ర సహాయంతో వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీసి బ్రతికి ఉన్న వాటిని కూడా చంపేశాడు.
ఈ విషయంపై రైతు రామాంజనేయులు మాట్లాడుతూ.. పొలాల్లో పాములు ఉండడం సహజమని.. కానీ ఒక్క మడిలోనే ఏకంగా వందకు పైగా పాములు ఒకేసారి, ఒకేచోట చూడడం తన జీవితంలో ఇదే మొదటిసారని తెలిపారు. నారుమడి వేయక ముందు పాములు వచ్చి చేరాయో లేక పక్కనే ఉన్న వంక నుంచి వచ్చాయో కానీ పొలంలో తాము ముందే గుర్తించకపోయి ఉంటే తనతో పాటు కూలీలు కూడా పాము కాటుకు గురై ఉండేవాళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా, పాములు ఉన్నాయని వ్యవసాయం వదులుకోలేం కదా అంటూ రామాంజనేయులు నిట్టూర్చారు.