యాప్నగరం

పెళ్లికి కొద్ది గంటల ముందు.. మనసులోని మాట బయటపెట్టిన వరుడు.. షాకిచ్చిన పెద్దలు

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అబ్బాయికి.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. పెళ్లి రేపనగా వరుడు మనసులో మాట చెప్పాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు.

Samayam Telugu 22 Feb 2021, 12:54 pm
పెళ్లి చూపులకు వెళ్లాడు.. పెళ్లికి ఓకే చెప్పాడు. దీంతో వివాహానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేశాయి. అందరికీ శుభలేఖలు పంపి.. బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానించారు. ఆదివారం రోజు పెళ్లి కాగా.. వరుడు సడెన్‌గా శనివారం అదృశ్యమయ్యాడు. ఏం జరిగిందో తెలియక ఇరు కుటుంబాలు ఆందోళన చెందాయి. అదే రోజు ఇంటికొచ్చి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తాపీగా చెప్పాడు. అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన ఈ ఘటన వివరాలు..
Samayam Telugu నమూనా చిత్రం
Photo for representative purpose only


గుత్తి ఆర్ఎస్‌కు చెందిన ఓ యువకుడికి కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం నంద్యాలలో పెళ్లి జరగాల్సి ఉంది. వివాహానికి ఏర్పాట్లు పూర్తి కాగా.. శనివారం వరుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఇరు కుటుంబాలు ఆందోళన చెందాయి. రాత్రికి గుత్తిలోని తన నివాసానికి చేరుకున్న అబ్బాయి.. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ బాంబు పేల్చాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు.

ఇంట్లోవాళ్లు ఎంత నచ్చజెప్పినా అతడు మనసు మార్చుకోలేదు. దీంతో చేసేదేం లేక వాళ్లు ఇదే విషయాన్ని వధువు తరఫు వారికి చెప్పారు. కొద్ది గంటల ముందు ఇలాంటి వార్త వినాల్సి రావడంతో వారు షాకయ్యారు. కానీ చేసేదేం లేక అంగీకరించారు. అమ్మాయి తరఫు వారు కట్నంగా ఇచ్చిన 12 తులాల బంగారం, 8 లక్షల రూపాయలను వెనక్కి ఇస్తామని అబ్బాయి వాళ్లు చెప్పారు. ఈ మొత్తానికి అదనంగా రూ.6 లక్షలు వరుడి కుటుంబీకులు చెల్లించాలని పెద్దలు తీర్మానం చేశారు. దీనికి ఇరు వర్గాలు ఒప్పుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.