యాప్నగరం

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Rohit లోకేష్ యువగళంలో పాల్గొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని ఒనుకురవారిపల్లి నుంచి నారా లోకేష్‌తో కలిసి పాదయాత్రలో నడిచారు.. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంపై స్పందించారు. కచ్చితంగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని చెప్పారు. అలాగే యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇచ్చారు. ఏపీలో తాజా పరిణామాలో అధికార పార్టీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిందన్నారు. అందుకే తెలుగు దేశం పార్టీపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందన్నారు రోహిత్.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 25 Mar 2023, 1:01 pm

ప్రధానాంశాలు:

  • లోకేష్ పాదయాత్రలో నారా రోహిత్
  • తారక్ పొలిటికల్ ఎంట్రీపై కామెంట్స్
  • యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nara Rohit
హీరో నారా రోహిత్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuva Galam) పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. లోకేష్‌త కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయిందని.. అందుకే టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్ర రాబోయే రోజుల్లో ఓ ప్రభంజనంలా మారబోతోందన్నారు. రాజకీయాల్లోకి యువత రావాల్సిన సమయం వచ్చిందని.. జూనియర్ ఎన్టీఆర్ (Junior Ntr) కూడా సమయం చూసుకుని రాజకీయాల్లోకి వస్తారన్నారు. అవసరమైనప్పుడు తారక్ కచ్చితంగా ఎంట్రీ ఇస్తారన్నారు.
మరోవైపు మూడు రోజుల విరామం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ముదుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ ఇస్తున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి ఫోటోలు దిగుతున్నారు.

మరోవైపు లోకేష్ పాదయాత్ర 50 వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 625 కి.మీ దూరం నడిచారు లోకేష్. ఇక 50వరోజు (25-3-2023) యువగళం పాదయాత్ర వివరాలు ఇలా ఉన్నాయి..

9.00 – ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం
10.00 – గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం
10.55 – వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ.
11.50 – ఒడిసి గ్రామంలో భోజన విరామం.
2.25 – ఒడిసి నుంచి పాదయాత్ర కొనసాగింపు
2.35 – ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ.
సాయంత్రం
4.00 – ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.
5.45 – మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం.
6.40 – రామయ్యపేట విడిది కేంద్రంలో బస

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.