యాప్నగరం

Tadipatri: జేసీ కుటుంబానికి పెద్దారెడ్డి సవాల్.. 35 ఏళ్లలో ఎప్పుడైనా ఆ పని చేశారా అని ప్రశ్న

Tadipatri: అనంత రాజకీయం హాట్ హాట్‌గా ఉంది. ముఖ్యంగా తాడిపత్రిలో కేతిరెడ్డి వర్సెస్ జేసీ ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. టైం వచ్చినప్పుడల్లా జేసీ కుటుంబానికి ఛాలెంజ్ చేస్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాజాగా మరోసారి జేసీ బ్రదర్స్‌పై ఫైర్ అయ్యారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 26 May 2023, 2:55 pm

ప్రధానాంశాలు:

  • జేసీ కుటుంబానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్
  • 2 పంటలకు నీరు ఇచ్చిన ఘనత మాదేనన్న పెద్దారెడ్డి
  • డ్యామ్‌లు కట్టి వదిలేసిన చరిత్ర జేసీ ఫ్యామిలీదని విమర్శ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kethireddy Pedda Reddy
కేతిరెడ్డి పెద్దారెడ్డి
Tadipatri: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. తాడిపత్రి నియోజకవర్గంలోని డ్యామ్‌లను నింపి.. రెండు పంటలకు నీరు అందిస్తున్నామని.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. గత 35 ఏళ్లలో జేసీ కుటుంబం ఏనాడు ఈ పని చేయలేదని వ్యాఖ్యానించారు. చేసినట్టు వారు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేవలం డ్యామ్‌లు నిర్మిస్తే సరిపోదని.. వాటిని నీటితో నింపాలని Kethireddy Pedda Reddy అన్నారు.
గ్రామాల్లో గొడవలు పడకుండా.. ఫ్యాక్షన్ తగ్గించడానికి తాను పాదయాత్ర చేస్తున్నానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజాసంక్షేమ యాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. తన మూడో విడత పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను.. అక్కడే ఉన్న అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని.. దానికి కారణం సీఎం జగన్ అని కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కంటే ఇప్పుడు గొడవలు తగ్గాయని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్‌కు ఎంక్వైరీ చేసుకున్న ఆ విషయం తెలుస్తుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గొడవలు ఉండొద్దని జగన్ గట్టిగా చెప్పినట్టు వెల్లడించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.