తాళం వేసిన ఇళ్లలో నేరాలు, బైక్ దొంగతనాలకు పాల్పడే నిందితుడి అరెస్ట్ చేసినట్లు అనంతపురం సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఇంచార్జి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అతని నుంచి రూ.5 లక్షల 26 వేలు విలువ చేసే బంగారు, వెండి నగలు, రెండు బైకులు, మూడు TV లు, రెండు ల్యాప్ టాప్లు, మొబైల్ ఫోను, ఇనుప రాడ్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. గురువారం వారు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వారు తెలిపిన వివరాల మేరకు.. పామిడి మండలం పాల్యం గ్రామానికి చెందిన కె.రామాంజినేయులు అలియాస్ అంజి అలియాస్ బాషా (24) ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కొట్టాలలో నివాసం ఉంటున్నాడు. అతను కూలి పని చేసుకుంటూ గత కొన్నేళ్ల నుంచి పేకాటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కూలి పనులు మానేసి డబ్బులు సులభంగా సంపాదించాలని భావించాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి గత సెప్టెంబర్ నుంచి అనంతపురం, చుట్టు పక్కల ప్రాంతాలలో చోరీలు చేశాడు.
ఎవరు లేని సమయాలలో తాళాలు పగల గొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంట్లో దాచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి నగలు, TV, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లేవాడు. అంతేకాకుండా.. ఇళ్ల ముందర పార్క్ చేసిన బైక్లను దొంగలించేవాడు. ఇలా దొంగలించిన బైకులను అక్రమంగా విక్రయించాలని తన ఇంటి వద్ద పెట్టుకొన్నాడు. ఇలా అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2 చోట్ల, అనంతపురం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట, అనంతపురం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట, రాప్తాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట నేరాలకు పాల్పడ్డాడు. ఈ నేరాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన పోలీసులు.. ఏర్పడి పక్కాగా రాబడిన సమాచారంతో దొంగను స్థానిక రుద్రంపేట సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు.
వారు తెలిపిన వివరాల మేరకు.. పామిడి మండలం పాల్యం గ్రామానికి చెందిన కె.రామాంజినేయులు అలియాస్ అంజి అలియాస్ బాషా (24) ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కొట్టాలలో నివాసం ఉంటున్నాడు. అతను కూలి పని చేసుకుంటూ గత కొన్నేళ్ల నుంచి పేకాటకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కూలి పనులు మానేసి డబ్బులు సులభంగా సంపాదించాలని భావించాడు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి గత సెప్టెంబర్ నుంచి అనంతపురం, చుట్టు పక్కల ప్రాంతాలలో చోరీలు చేశాడు.
ఎవరు లేని సమయాలలో తాళాలు పగల గొట్టి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇంట్లో దాచిన విలువైన బంగారు ఆభరణాలు, వెండి నగలు, TV, ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లేవాడు. అంతేకాకుండా.. ఇళ్ల ముందర పార్క్ చేసిన బైక్లను దొంగలించేవాడు. ఇలా దొంగలించిన బైకులను అక్రమంగా విక్రయించాలని తన ఇంటి వద్ద పెట్టుకొన్నాడు. ఇలా అనంతపురం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో 2 చోట్ల, అనంతపురం ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట, అనంతపురం రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట, రాప్తాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఒక చోట నేరాలకు పాల్పడ్డాడు. ఈ నేరాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన పోలీసులు.. ఏర్పడి పక్కాగా రాబడిన సమాచారంతో దొంగను స్థానిక రుద్రంపేట సర్కిల్ వద్ద అరెస్ట్ చేశారు.