యాప్నగరం

సత్యసాయి జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు

శ్రీసత్య సాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్‌నకు గురవడం తీవ్ర కలకలం రేపింది. అయితే, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును గంటల్లోనే ఛేదించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 21 Jun 2022, 5:04 pm
శ్రీసత్య సాయి జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. అయితే, బాలిక కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును చేధించారు. భోగినేపల్లికి చెందిన మైనర్ బాలికను చియ్యేడు గ్రామానికి చెందిన యువకుడు కారులో కిడ్నాప్ చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయితే కిడ్నాప్ చేసిన వ్యక్తి మైనర్ బాలికకు సమీప బంధువు సదానందగా పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తెస్తూ అపహరించాడని పేర్కొన్నారు. అయితే, బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఇటుకలపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు.

అనంతపురం నగరంలోని తపోవనంలో కిడ్నాప్‌కు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. మైనర్ బాలికను రక్షించారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు. గంట వ్యవధిలోనే కిడ్నాపర్ల నుంచి మైనర్ బాలికను కాపాడడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో పోలీసులు స్పందించడంతోనే తమ కూతురు బయట పడిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.